ALO REMBAAVAI-05

ఐదవ పాశురం *************** మాయనై మన్ను వడమదురై మైందనై తుయపెరునీర్ యమునై యరైవరై ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణివిళక్కై తాయై క్కుడల్ విళక్కం శెయద దామోదరనై తూయోమాయ్ వందు నాం తుమలర్ తూవి త్తుళుదు వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క పోయ పిళైయుం పుగుదరువా నిన్రనవుం తీయనిల్ తూశాగుం శెప్పు ఏలోరెంబావాయ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎంపావాయై - మన వ్రతములో ఈ రోజు, మనము దామోదరుని దగ్గరనుండి ఒక వరమును అడిగి అనుగ్రహించమని గట్టిగానే అడుగుదాము అంటున్నది గోదమ్మ గోపికలతో. ఈ పాశురములో గోపికల వాక్చాతుర్యము-త్రికరణశుధ్ధి-గడుసుదనము కలగలిసి స్వామినే సెప్పు-గట్టిగా చెప్పు అని అడుగుతున్నవి.స్వామి వారికి ఏమని చెప్పాలో తెలుసుకొనే పయత్నమును చేద్దాము. గోదమ్మ స్వామిని, మైందనై-అని పిలుస్తున్నది. బాహ్యమునకు ఓ బాలకా అని ధ్వనిస్తున్నప్పటికిని, ఓ మూలమా/ ఓ పరబ్రహ్మమా/ ఓ నాయకా అని స్పష్టముగా ప్రతిధ్వనిస్తున్నది. కనుకనే వెంటనే-మాయినై అని -స్వామి నీ యొక్క, మన్ను-లీలా విభూతులు, వర్ణింపశక్యము కానివి అంటున్నది. ఏమి తెలియని వాడిలా...