SAUNDARYA LAHARI-84
సౌందర్య లహరి-పురుహూతికాదేవి పరమ పావనమైన నీపాద రజకణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము వృతాసురుని వధించిన పాతక పరిహారమునకు పురుహూతుడు చేసెను కఠినమైన తపస్సు ప్రసన్నమైనది తల్లి-పురుహూతికగ మారినది పవిత్రుడైనాడు గయుడు విష్ణువర ప్రభావమున హవిస్సులను ఆపినాడు-విచక్షణను వీడినాడు గయుని యజ్ఞవేదికగా కోరిరి శివకేశవులు మాయాసతి పీఠము మహిమాన్వితమైనది పిఠాపురము పాదగయలో నా పాదము పావనమగుచున్నవేళ నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా మానస విహారి! ఓ సౌందర్య లహరి. "పురుహూత సతి మాత పీఠికాపురు సంస్థిత పుత్రవాత్సల్యతా దేవి భక్తానుగ్రకారిణి" రాక్షసరాజైన గయుడు విష్ణుభక్తుడు.ఘోరతపముచేసి విష్ణువుని ప్రసన్నముచేసుకొనెను.తన శరీరము ఆపాదమస్తకము సకల తీర్థక్షేత్రములకన్న అతి పవిత్రము కావించమని వరమును ప్రసాదించమని కోరి,అతి పవిత్రుడయ్యెను.ఆ వర ప్రభావముచే పంచమహా పాతకములు గయుని శరీరస్పర్శచే పటాపంచలయేవి.సకలచరాచరములు గయశరీర స్పర్శచే ముక్తిని పొందెడివి.పుణ్యఫల...