NA RUDRO RUDRAMARCHAYAET-27(SIVANAMDALAHARI)

శ్లో : కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధన-పతౌ గృహస్థే స్వర్భూజా(అ)మర-సురభి-చింతామణి-గణే శిరస్థే శీతాంశౌ చరణ-యుగలస్థే(అ)ఖిల శుభే కమ్-అర్థం దాస్యే(అ)హం భవతు భవద్-అర్థం మమ మనః 27 ప్ర్రస్తుత శ్లోకములో ఆదిశంకరులు పరమేశ్వరునకు తన మనసును సమర్పిస్తున్నానని అంతకు మించి తాను అర్పించుటకు స్వామి అడుగుటకు వేరేదేమి లేదని స్వామి వైభవమును ప్రస్తుతిస్తున్నారు.నిజమునకు ఇంతకు ముందు ఆశ్లోకౌలలో పలుమారులు మనసు ప్రస్తావన వచ్చినది. 7.వ శ్లోకములో మనస్తే పాదాబ్జే అంటూ,స్వామి నా మనస్సు నీ పాదపద్మములయందు స్థిరపడియుండునుగాక అన్నారు. 11.వ శ్లోకములో -యదీయం హృత్పద్మం యది భవదధీనం అంటూ మరొక్కసారి నొక్కిచెప్పారు. 12.వ శ్లోకములో సైతము "యస్తైవాంతః కరణం అపి శంభో తవ పదే స్థితం" అని మరీ మరీ చెప్పారు. అప్పుడు శంకరులవారికి స్వామి అనుగ్రహించిన దర్శనమునకు అతీతముగా ప్రస్తుత శ్లోకములో అనుగ్రహించారేమో అనిపిస్తున్నది. ఎందుకంటే స్వామి స్థితికారకత్వమునకు సంకేతములుగా ఏవేవి స్వామిని సేవిస్తున్నాయో సంకీర్తిస్తూ,నిజమునకు అవి స్వామి పాదముల దగ్గర సర్వశుభంకరములుగా సన్నుతింపబడుతున్నాయనటం వెనుక సర్వేశ్వర...