Posts

Showing posts from December 14, 2020

ALO REMBAAVAI-03

Image
 మూడవ పాశురం *************** ఓంగి ఉలిగళంద ఉత్తమన్ పేర్పాడి నాంగళ్ నంబావైక్కుచ్చాత్తి నీరాడినాల్ తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయిదు ఓంగు పెరుం శెన్నల్ ఊడు కయల్ ఉగళ్ పూంగువళై ప్పోదిల్ పొరివండు కణ్పడుప్ప తేంగాదే పుక్కిరుందు శీర్తములై పట్రి వాంగక్కుడం నిరక్కుం వళ్ళల్ పెరుం పశుక్కళ్ నీంగాద శెల్వం నిరైందు ఏలో రెంబావాయ్.   ఓం నమో భగవతే వాసుదేవాయ.   నంబావైక్కు-మనము వ్రతమును   చ్చాత్తి-చేద్దాము.    దేనిని ముగించిన తరువాత?     నీరాడినాల్-యమునలో స్నానము చేసిన తరువాత.   ఏ విధముగా నోమును చేద్దాము అంటే,   అళంద-కొలిచిన. దేనిని కొలిచిన?   ఉలగం-లోకములను, ఏ విధముగా?   ఓంగి-తనకు తానే తనరూపమును విస్తరించుకొనిన,   ఉత్తమన్-పరమాత్మను,   పేర్పాడి-నామ సంకీర్తనముచేస్తుంటే,   గోదమ్మ నవవిధ భక్తులలోని నామసంకీర్తన ప్రాశస్త్యమును మనకు తెలియచేస్తున్నది.త్రేతా యుగములో రాముని కన్న రామనామము అత్యంత మహిమాన్వితమైనదని చాటాడుగా.    అద్భుతములు ఆవిష్కరింపబడుతాయి అంటున్నది గోదమ్మ-గోపకాంతలతో.  మొదటిది-    తీంగిన్ర...

ALO REMBAAVAI-02

Image
రెండవ పాశురము *************** వైయత్తువాళ్వీర్గాళ్ నాముం నం పావైక్కు చ్చెయ్యుం కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్ పైయత్తు ఇన్ర పరమన్ అడిపాడి నెయ్యిణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి మై ఇట్టు ఎళుదోం మలరిట్టునాం ముడియోం శెయ్యదన్ శెయ్యోం తీక్కురళై శ్శెన్రు ఓదోం ఐయయుం పిచ్చైయుం ఆందనయుం కైకాట్టి ఉయ్యుమారు ఎణ్ణి ఉగందు ఏలోరెంబావాయ్. తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో     కేళీరో-వినండి. ఎవరు వినాలి?    వైయత్తు వాళ్వీర్గాళ్-ప్రపంచములో నున్న జనులారా. ఏమి వినాలి?  పార్కడలుళ్-పాల కడలిలో    పైయెత్తు ఇన్రా-విలాసముగా పడుకొని ఉన్నవాడు. వాదే,   నాముం-మనలను, నం పావైక్కు-మనలను కరుణతో చూచేవాడు.                         వాడు,   పరమన్-పరమాత్మ. అంతేకాదు,కిరిశైగళ్ సెయ్యుం-మనలను రక్షించే పనులనే చేయువాడు.   వాడి,      అడిపాడి-పాదపద్మములను విడువద్దు.    మనము కొన్నింటిని పరిత్యజిద్దాము.మరి కొన్నింటిని పరిగ్రహిద్దాము.   మొదటగా     పరిత్యజించ  వలసిన వాటి గురించి,  నెయ...

ALO REMBAAVAI-01

Image
  ఓం నమో నారాయణాయ.   *****************  ద్రవిడ సంప్రదాయము పరమాత్మను గుర్తిస్తూ-కీర్తిస్తూ-తరిస్తూ-తరింపచేసే సాహిత్య గాన ప్రక్రియను పాశురముగా పరిగణిస్తారు.     పన్నెండు మంది ఆళ్వారులు అనుభవించి,అందించిన పాశురముల సమాహారమును నాలాయిరం అని కీర్తిస్తారు.     ద్వాదశాళ్వారులలో పరమ పునీత ఆండాళ్ తల్లి అవ్యాజకరుణతో అనుగ్రహించినది ఈ ముప్పది పాశురముల ముక్తిమాలిక.       ఇంకొక విషయము ఏమిటంటే పరమాత్మ యొక్కడేపురుషుడు.మనమందరము జీవులము.  అమ్మ దయతో పరమాత్మ తత్త్వమును అర్థముచేసుకుంటూ, ఆచరిస్తూ,ఆస్వాదిస్తూ,అనుభవిస్తూ, అడుగులను కదుపుదాము.        ఏలో రెంబావై-01      *****************    మొదటి పాశురం. ***************  "మార్గళిత్తింగళ్ మది నిరైంద నన్నాళాల్   నీరాడ ప్పోదువీర్! పోదుమినో నేరిళైయీర్   శీర్మల్లుం ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్కాళ్   కూర్వేల్ కొడున్ తొళిలన్ నందగోపన్ కుమరన్   ఏరారంద కణ్ణి యశోదై ఇళం సింగం   కార్మేని చ్చెంగణ్ కదిర్ మదియంపోల్   ముగత్తాన్  ...

ALO REMBAAVAI-INTRODUCTION.

Image
      ఏలో రెంబావై-         వ్రతమునకు రండు.   *************************  శ్రీగోదాం అనన్య శరణం శరణం ప్రపద్యే ********************************* " శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే". శ్రీవైష్ణవ సాంప్రదాయానుసారము "ఆళ్వారులు" అనగా దైవభక్తిలో అనవరతము మునిగియున్న జ్ఞానగనులు/ఘనులు.              .బధ్ధజీవులను తమతో పాటు తిప్పుకొనుచు,భగవత్తత్త్వము అను సముద్రములో అనవరతము మునకలను వేయిస్తు,ప్రకృతిలోని ప్రతివస్తువులోను-ప్రతిచర్య లోను పరమాత్మను దర్శింపచేస్తూ,బ్రహ్మానందమును చేర్చువారు.మార్గదర్శకులుగా సామాన్యుల వలె కనిపిస్తూ సర్వమును అర్థముచేయించగల దైవాంశ సంభూతులు.దివ్య నమస్కారములు . " భూతం నరస్య మహదహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భకాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం." ఆళ్వారులులలో ఒకరైన ఆండాళ్ తల్లి (సాక్షాత్తు భూదేవియే) తనను తాను ఒక సామాన్య గోపిక వలె భావించుకొని,వివిధ స్వభా...