TANOTU NAH SIVAH SIVAM-21@SIVATANDAVASTOTRAMU
.jpg)
" ఆంగికం భువనం యస్య-వాచకం సర్వ వాజ్మయం ఆహార్యంచంద్ర తారాది తం నమః సాత్వికంశివం." అమ్మ అందించిన సకల కళల సమాహార మధూను తనివితీర గ్రోలిన స్వామి తాండవమును ప్రారంభించాడట అమ్మ లాస్యమును జతకలుపుతు. స్వామి ఒకసారి తనుమరచు ఉప్పొంగు నాట్యమున ఒకసారిమరపించు, మరచి మరువక ఒకపరి, ఓహో హోహో ఊహాతీతంబీ ఆనందము అంటున్నాడు రావణుడు. (పుట్టపర్తి నారాయణాచార్యుల వారికి నమస్కారములతో) " స్వామి గలమున నున్న కాళములు ఆశ్చర్యముగా కదులుతు తమ శ్వాసలతో జయత్ జయత్ అంటున్నాయట.ఆ సంభ్రమ నాదమునకు పరవశయైన స్వామి ఫాలనేత్రము పైకుబికి పరవశసిస్తున్నదట. ఇది జరుగుచున్న కథ.రావణునికి స్పురించిన దృశ్యము. ప్రస్తుత భాగములో రెండు స్వామీనుగ్రహ విశేషములు సంకేతించబడినవి. కిందటి భాగములో స్వామిగలము నల్లకలువగా చల్లదనమునందించుచు ప్రపంచవికసనమునకు నాంది పలికినది. స్వామి తాండవము సృస్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహమను పంచకృత్య పరాయనము.స్వామి పదవిన్యాసము ప్రపంచ అవస్థా సంక...