KADAA TVAAM PASYAEYAM-21

కదా త్వాంపశ్యేయం-21 ****************** "పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనౌ జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైరహం ప్రార్థితో మామా జ్ఞాపయ తన్నిరూపాయ ముహుర్మామేవ మామేవచః." ఓ! మృత్యుంజయా ! ఓ మహేశా! ఎంతటిచమత్కారి నీఅనుగ్రహము.ఆనవాలు లేనట్టు మా పాపములు తొలగించివేసినది.ఎంతటి చతుర నీ కరుణ.వాటిని తిరిగి మా దరిచేరనీయనని,మా మనస్సును నిన్ను ధ్యానింపుమని,శిరమును నీకు నమస్కరించమని,చెవులకు నీ దివ్యకథలను ఆలకింపమని,పాదములను నీకు ప్రదక్షిణములను చేయమని,కన్నులకు నీ దివ్య విగ్రహమును దర్శించమని,అని కొత్త ఆటలను పరిచయము చేస్తూ,వాటి నన్నింటిని సమన్వయపరుస్తున్నది సహృదయతతో. స్వామి నీకు నీ కరుణకు లేశమంతయును భేదములేదు కదా ఖేదహరణములో. అట్టి నీ అవ్యాజకరుణను మామీద అనవరతము వర్షించనిమ్మని ఆ ఆదిదేవుని ప్రార్థిస్తూ,ఈ నాటి బిల్వార్చనమును ప్రారంభిద్దాము. గురువుగారు శంకరయ్యను చూస్తూ,ప్రారంభించు అన్నట్లుగా సైగచేసారు. ముచ్చెమటలు పోస్తున్నాయి శంకరయ్యకు.తనకు ఏమి తెలుసనిచెబుతానన్నాను నిన్న.అని మహేశా ఎందులకీ పరీక్ష .అంతలోనే,...