cheramaan naayanaar
చేరమాన్ నాయనార్ *************** " ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు" ఘనసారమును తెచ్చి కలియ చల్లు విధాన మనసులో సంతసము కనుల జారు విధాన కులుకు నీలపుగండ్ల తళుకు చూపులు మెరయ ఘల్లు ఘల్లుమని కాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు" (ఘనసారము= కర్పూరము.) శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు. పెరుముక్కో అడయార్ నాయనార్ కేరల రాష్ట్రములోని చేర రాజ్య వంశములో జన్మించినప్పటికిని రాజ్యమును తృణప్రాయముగా నంచి,శివభక్తిని పెంపొందించుటకు తన జీవితమును అర్పింపదలచినాదు. కాని శివుడు తన భక్తునకు ఎవ్వరి మనసులోని భావములను కాని,ఏ స్థలము-వస్తువు మొదలగు వాని స్వరూప-స్వభావములౌ చిటికెలో గ్రహించగల వరమును ప్రసాదించి,రాజ్యాభిషిక్తుని చేసెను. ఎవరి మనౌలోని భావములనైన గ్రహించగల శక్తిమంతుడు కనుక పెరుముక్కూ అడయర్ గా ప్రైధ్ధిని పొందెను. రాజ్యము వీర భోజ్యము అన్నది ఆర్యోక్తి.బలపరాక్రమములు-కళరిర్-దయాదాక్షిణ్యములు కల నాయనారును, కళరిర్-అరివర్ గా కీర్తింపబడుచున్నాడు. చేరరాజ్య ప్రభువు కనుక చేరమాన్ నాయనారుగాను ఖ్యాతికెక్కినాడు. సగౌరవ సూచకముగా చేరమాన్ నాయనార్ గజారోహుడై నగరవ...