TIRUPPAAVAI-04

తిరుప్పావై-నాల్గవ పాశురము ********************* "మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం విశ్వోప జీవ్యమమృతం వచసా దుహానాం తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం." పూర్వ పాశుర ప్రస్తావనము. ******************* మొదటి పాశురములో మార్గళి గ్రించి,రెందవ పాశురములో నోము నియమముల గురించి,మూడవ పాశురములో వర్ష ప్రాశస్త్యమును వివరిస్తూ,ఆచార్య వైభవమును పెరుం పశుక్కళ్ అంటూ జ్ఞానమను గోక్షీరమును పుష్కలముగా అనుగ్రహించుచున్నారని తెలిపినది.అమ్మకు సంతృప్తి కలుగలేదు ఆ పరమాత్మ-ఆచార్య వైభవమును మరికొన్ని సంకేతములతో స్పష్టము చేస్తున్నది. స్వామిని-గురువును నల్లని కరుణామృత మేఘముతో పోలుస్తూ,ఏ విధముగా సముద్రపు ఉప్పునీటిని సూర్యకిరణములవేడితో పైకి గ్రహించి,వానిలోని దోషములను హరించి,మంచినీటిని వర్షించునట్లు,గురువు సైతము అజ్ఞానమనే శిష్యుల ఉప్పునీటిని తన విద్వత్తు అనే సూర్యకిరణముల వేడితో పైకి తీసుకుని,శుభ్రపరచి జ్ఞానమనే మంచినీటిని వర్షిస్తాడు.అంతేకాదు మేఘము అన్నిచోట్ల సమముగానే వర్షిస్తుంది.గురువు సైతము తన శిష్యుల...