SARVA SAmKSHOBHANA CHAKRAMU-PARICHAYAMU

"అష్టదళ కమలమందు నిష్ఠతో నీ ప్రతిమ నిలిపి సృష్టికర్తవనువనుచు తెలిసి ఇష్తముగ సేవించుచుంటి ఈశ్వరి నీకిదిగోమంగళం త్రిపురంతకవాసిని దేవి నీకిదిగో మంగలం" పరమేశ్వరి దయతో మనము అష్టదళ విలసితమైన సర్వసంక్షోభణ చక్రములోనికి ప్రవేశించుచున్నాము.ఇక్కడానంగశక్తులు గుప్తతర యోగినులుగా త్రిపురసుందరి సమేతులై విరాజిల్లుచున్నారు. అమ్మవారిని లక్ష్మీ స్వరూపముగాకీర్తించేటప్పుడు, అనంగ పాయనీ/అనంగపారగావీక్షణ శబ్దములు వింటుంటాము. అనంగా అను శబ్దమునకు అవిభాజ్యము/అఖందము/అనంతము/అవిఛ్చిన్నము/ఆది-మధ్య-అంతరహితము అన్న భావముతో సమన్వయిస్తారు. మనము ఇంతకుముందు "సర్వాశాపరిపూరక చక్రములో" కామాకర్షిణి మొదలగు గుప్తయోగినుల అనుగ్రహమును తెలుసుకున్నాము. సామాన్యముగా ఆకర్షణ అనునది ఒక వస్తువుపైనగాని/ఒకమనిషిపైన కాని/ఒకప్రాంతమునందు గాని/ఒక సంఘటనమునందుగాని నిలిచి,కాలక్రమేణ తగ్గుతుంటుంది.అది ప్రాపంచిక విషయసంబంధమైతే పరిణితి చెందక ఉంటుండి. కాని "సర్వసంక్షోభణ చక్రము"నందలి గుప్తతర యోగినులు అనంగులు.అపరిమిత శక్తి సంపన్నులు.వారి అనుగ్రహమ...