TANOTU NAH SIVAH SIVAM-20@SIVATANDAVASTOTRAMU
.jpg)
" ఝణ ఝణ ఝణఝణం ఝణిత మథుర శబ్ద సంభరితం తక తక తకిట తకిట లాస్యతాండవార్పితం ధిమి ధిమి ధిమి ధిమితహృదయ మర్దన ద్వారం ఖలు ఖలు ఖలు కణ్విత రుద్రభద్ర చరణరజం అనుదిన గౌరీశంకర పదాంభోజనివేదితం (శ్రీ సామవేదం వారి) ధ్యానం-వచనం-చరణం-పరమపదం-శివపదం. పరమేశ్వరానుగ్రహము పదేపదే పలుకరిస్తుంటే, ఎంతటిభాగ్యము, ఆభక్తాగ్రేసరుడు అమ్మనుచూడగలుగుతున్నాడు.తల్లిసర్వమంగళ.అంతేకాదు.దోషములు అసలు లేనేలనిది. ఆ జగజ్జనని తన కళలను సౌరభకుసుమములుగా విరగపూయిస్తూ స్వామిని అనురాగముతో చూస్తున్నది.ఆ శక్తి సృష్టించిన పుష్పముల మహిమలన్నీ మధువుగా మారుతూ మరింత మహదేవుని ఆస్వాదనమునకై ఆహ్వానిస్తున్నాయి. మహదేవుడు కేవలము మధువును మాత్రమే స్వీకరించే మధూవ్రతి అయినాడు.మధురాతిమధురము ఆ మహదేవునికటాక్షము. స్తోత్ర ప్రస్తుత భాగము పితరం జగతం వందే పార్వతీ పరమేశ్వరం ను దర్శింపచేస్తున్నది. మధువు-మధుపము-మధువ్రతము అన్నవి ముఖ్యాంశములు. అమ్మ సర్వమంగళములన...