ANIRVACHANEEYA-ADITYAHRDAYAM(RUCHAYE-LOKASAKSHINE-21)
.jpg)
తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే । నమస్తమోఽభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే ॥ 21 ॥ ప్రస్తుత శ్లోకము కిరణ ప్రాశస్త్యముతో స్వామి విభవమును మరింత స్పష్టపరుస్తున్నది. ఇప్పటివరకు అగస్త్యునిచే చెప్పబడిన ఆదిత్యహ్ర్దయ శ్లోకములలో కరోతి ఇతి కిరణ అన్న సూక్తి ప్రకారము స్వామి దినకరుడు-దివాకరుడు-ప్రభాకరుడు-భాస్కరుడు-అహస్కరుడు-అను కారక శబ్దముచే కీర్తింపబడినాడు. అంతే కాదు గభస్తిమాన్-అంశుమాన్-తేస్వన్-రశ్మిమాన్-సముద్యమాన్-వివస్వాన్-తిమిర ఉన్మథనాన్,జ్యోతిషాన్ అంటూ స్వామి యొక్క ప్రకాశము ప్రస్తుతింపబడినది. అదే విధముగా తప శబ్దము కూడా శిశిర తపనో,ఆతపీమండలీ,భాస్వర సర్వతాపనఃపాయత్యేషి-తపయేషి అంటూ తాపమును కలింగునది-తొలగించినదియును తానే అయిన పరమాత్మను గుర్తించి-గౌరవించినది. పెద్దలు తప అన్న శబ్దమునకు ఐశ్వర్య సంకేతముగా కూడా అన్వయిస్తారు.దాని సంకేతమేమో వహ్నయే శబ్ద ప్రాముఖ్యము. స్వామి తప్త-కాల్చబడిన-పరిశుద్ధము చేయబడిన చామీకరములు కలవాడు. చామీకరము అనగా బంగారు కిరణములు కలవాడు.అనగా ఆ హిరణ్యగర్భుడు-సువర్ణతేజశుడు అగ్నిలో పుటమువేశిన రుచులతో/కాం...