MAAKU SAUKHYAMU PRASAADIMPUMU SIVAA

దీపావళి శుభాకాంక్షలను కొనసాగిస్తు ప్రియ మిత్రులారా, సర్వము శివమయము-సమస్తము శివాధీనము అను విషయము నిర్వివాదాంశము.ధూర్జటి భావన ప్రకారము బాలుడు అరటిపండ్లు కావలెననగానే వాత్సల్యలక్ష్మీవిలాసముతో తెచ్చి ఇచ్చినట్లు ఆ పరమదయార్ద్రహృదయుని అరటిపండ్లమాధుర్యమును అందించు అద్భుతకథలు కావాలని నాచే అడిగించి," నా ప్రయచ్చంతి సౌఖ్యం" మాకు సౌఖ్యమును ప్రసాదింపుము అను పేరు గల అద్భుత కథలనుపవిత్ర కార్తిక మాస కానుకగా అందించినాడు. సత్యాన్వేషణలో మునిగిన యాజ్ఞవల్క్యమహాముని శిష్యులు,సవినయముగా తమ గురువుగారికి పాదాభివందనమును చేసి,తమ సందేహమును వెలిబుచ్చినారట.గురుదేవా! దేనిని జపించుట వలన అమృతత్త్వము సిధ్ధించును? అని.వారి సత్యాన్వేషణకు సంతసించిన ఆచార్యుడు ఆనందముతో,నాయనలారా! " శతరుద్రీయ పారాయణము" నిస్సందేహముగా అమృతత్త్వప్రదాయిని అని అనుగ్రహించినారట.అపుడు వారు గురుదేవా శతరుద్రీయమును గురించి వివరించమని వేడుకొనగా, రుద్రాధ్యాయము వైదికమగు స్తుతి.రుద్రార్చన వేదమంత్రమయము.కృష్ణయజుర్వేదమైన తైత్తరీయ సంహిత నమక-చమక విశిష్టతను ప్రస్తావించినది.11 అనువాకములు గల నమకము నమః అను శబ్దము పలుమార్లు ఆవృత...