ALO REMBAVAY-23

ఇరవదిమూడవ పాశురం ********************* మారిమలై ముళింజిల్ మన్నికొడందు ఉరంగం శీరియశింగం అరిఉత్తు త్తీవిళిత్తు వేరి మయిర్ పొంగ వెప్పాడుం పేరొందు ఉదరి మూరి నిమిరిందు ముళంగి పురప్పట్టు పోదరుమా పోలే ,నీ పూవై పూవణ్ణా! ఉన్ కోయిల్ నిన్రు ఇంగనే పోందరుళి,కోప్పడయ శీరియశింగాసనత్తు ఇరుందుయాం వంద కారియం ఆరాయందు అరుళ్ ఏలోరెంబావాయ్ ఓం వ్యతస్త పాదారవిందాయ నమః ***************************** మహాద్భుత-మంగళ పరిస్థితులను ఉదహరిస్తు గోదమ్మ మనలను ఈ పాశురములో మంత్ర ముగ్ధులను చేస్తున్నది.గోపికల సర్వస్య శరణాగతియే స్వామిని అపన్న ప్రపన్నుని-ఆహ్లాద ప్రసన్నుని చేస్తూ మనలను గమన సౌందర్యముతోను-ఆసీన సౌందర్యముతోను అలరించుటకు పూనుకున్నది. స్వామి, శీరియ సింగము-పరాక్రమమైన సింహము అంటే పర-పరమాత్మ ఇప్పుడు ఏవిధముగా నున్నాడంటే సర్వమును ఆక్రమించి,తనలో ముడివేసుకొని,నల్లనైన చీకటితో నిండిన , మలై-కొండయొక్క, ముళింజిల్-గుహలో,ఎవరితో నున్నాడు? మణ్ణిక్-భార్యతో/సివంగితో, కిడందు-మై...