TIRUPAVAI-02

. తిరుప్పావై-రెండవ పాశురము ********************* "మాతః సముత్థితవతీ మది విష్ణుచిత్తం విశ్వోపజీవ్యమమృతం వచసా దుహానాం తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం సంతఃపయోధి దుహితః సహజాం విదుస్త్వాం." పూర్వ పాశుర ప్రస్తావనము ******************** " తిరు-పావై " అనగా శ్రీ వ్రతము. పవిత్రమైననోము.ఇది నిజమునకు విల్లిపుత్తూరులో జరిగినదని పెద్దలు భావిస్తారు.తానొక గోపికయై,విల్లిపుత్తూరును రేపల్లెగా భావిస్తూ,తన చెలులందరినికలుపుకుంటు,యశోద-నందులను-బలరాములను -కృష్ణుని తమ నోముస్థలికి రమ్మని ఆహ్వానించుట,శ్రీకృష్ణునకు పోట్రి(మంగళములు) పాడుట,రాసలీలలు చేయుట చివరకు గోదాకళ్యాణముతో ఈ ద్రవిడప్రబంధము సకలజనులను ఆశీర్వదిస్తుంది . రెండవ పాశురములో గోపికలు గోదమ్మతో పాటుగా "కాత్యాయినీ వ్రతమును " చేయ సంకల్పించుకుని,వ్రత నియమములను తెలుసుకుంటుంటారు. . అసలు ఈ వ్రతమును చేయుటకు ముందు రేపల్లెలో వర్షములు లేక క్షామము సంభవించినదట.దానికి ఎందరు ఎన్నివిధములుగా ప్రయత్నించినను పరిష్కారము లభించలేదు.శ్రీమన్నారాయణుని అనుగ్రహముతో రేపల్లె లోని కన్నెపిల్లలు "కాత్యాయినీ ...