Posts

Showing posts from February 28, 2023

SIVATANDAVASTOTRAMU( TAAMDAVA SIVAM KAROTI)--11

Image
  జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస- -ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ | ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః || 11 ||     ప్రస్తుత శ్లోకములో సర్వ చరాచరముల పరిణామములను సంకేతించుచు,విష్ణువు మృదంగధ్వని క్రమముగా స్వామి నర్తనము జరుగుచున్నదని వివరిస్తున్నారు.అదే విధముగా సర్పముల శ్వాసప్రక్రియ యొక్క రాక-పోకల లయము/లీనత్వమును వివరిస్తూ,లలాట నేత్రము ఏ విధముగా కీలలతో జ్వలితమగుచున్నదో వర్ణించబడినది. విత్తు స్థితి నుండి మొలక స్థితికి జరిగే పరిణాములో/మార్పులో పూర్వస్థితి-తదుపరి స్థిలో కలిసిపోతుంది.ఆ మొలక మొక్కగా మారువేళ రెండు స్థితులు అవే బీజస్థి-మొలకస్థితి-మొక్క స్థితిని పొంది,తదుపరి వృక్షస్థితికి చేరునపుడు నాలుగు స్థితులను ఒక స్థితిలో ముందటి స్థితిని లీనము చేసుకుంటూ ముందుకు సాగుతుంది.అదే విధముగా స్వామి తాండవము సైతము ఒక స్థితి నుండి మరొకస్థితి తన పూర్వస్థితిని తనలో లీనము చేసుకొని తదుపరి స్థితిని పొందుటకు ముందుకు సాగుతుంటుంది.  మొదటి శ్లోకములో డమడమ డమ అంటూ డమరుక శబ్దముతో ప్రారంభించిన తాండవమును ధిమి ధిమి ధిమి అను మ్ర్దంగ ధ్వనికి అనుగుణముగా నర...

SIVATANDAVASTOTRAM( MADHUVRATAM AHAM BHAJE)-10

Image
అఖర్వ   సర్వమంగళాకళాకదంబమంజరీ రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ | స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || 10 ||    "పరిత్రాణాయ సాధూనాం -వినాశాయచ దుష్కృతాం"    అన్న పరమాత్మ నియమమే మధువ్రతము.ఒక చక్కని నియమము.ఆ విషయమునే సాధకుడు ప్రస్తుత శ్లోకములో సుస్పష్టము చేయుచున్నాశ్డు.  అంతేకాదు సాధకుడు స్వీకరనము-సంహరనము అను రెండు విరుద్ధ చ్విషయములను తెలియచేస్తున్నారు.  ఒక పదార్థము కాని-ఒక విషయము కాని స్వీకరణమునకు యోగ్యతను పొందాలంటే దానిలోని దోషములు తొలగ్ఫింపబడాలి.ఆ విషయమునే అమ్మ పరముగా-అఖర్వ సర్వమంగళా గా కీర్తింపబడుతున్నది క్రియారూపముగా. అఖర్వ-దోషరహితమైన సర్వమంగళ కర్తగా స్వామి ప్రస్తుతింపబడుతున్నాడు.  స్వామిని సాకారముగా కీర్తించాలనుకుంటే స్వామి మన్మథుని-త్రిపురాసురుని-దక్షుని-గజాసురుని-అంధకాసురుని-యముని అంతమొనరించి -దోషరహితమైన అమృతత్త్వాని-కదంబ పుష్ప మధువును గ్రహించు వ్రతమును పూనియున్నాడు.  అంతరార్థమును గమనిస్తే స్వామి జనన-మరణ చక్రమునుండి విముక్తులను కావించుచున్నాడు.  కనుకనే, " పునరపి జననం-పునరపు మరణం   పునరపి జననీ-జఠరే...

SIVATANDAVASTOTRAM(AHAM cHIDAM BHAJAE) -09

Image
   ప్రస్తుత శ్లోకములో సాధకుడు తం భజే నిన్ను భజించవలెన్న ఆకాకంక్షను స్వామికి నివేదించుకుంటున్నాడు.  కథాపరముగా అన్వయించుకుంతే జలమయమయిన ప్రపంచము నల్లనికాంతులీనుతున్నది.దానినే "ప్రపంచకాలిమప్రభా" అని స్తుతిస్తున్నాడు.సర్వం అగోచరము.రంగులు లేఉ.గుణములు లేవు.రేయి-పగలు లేదు.త్రిగునములు లేవు.జీవులు లేరు.అంతా ఒకేఒక నల్లనైన ముద్ద.  కాని ఆ నల్లని ముద్దలోని స్వామి అనుగ్రహమనే చైతన్యము ప్రసరించగానే నల్లకలువగా పూర్తిగా విచ్చుకుంటూ దానిలో దాగియున్న ద్వంద్వములను వేరువేరు చేసి చూపిస్తున్నది.అదియే చీకటిని దాటిన ప్రకాశము.మంచిచెడులను గుర్తించగల వివేకము.మనము సున్నను శూన్యము అని భావిస్తాము-పూర్ణము అని కూడా అంగీకరిస్తాము.అదే జరుగుతున్నది ఇక్కడ గుప్తముగా నున్న స్థితి నుండి ప్రకటనము జరుగుచున్నవేళ,ఎన్నో నామములతో-ఎన్నెన్నో స్వభావములతో ఉత్పన్నమైన శక్తులను ఛేదించి-విడదీసి అమనకు చూపించుచున్నది స్వామి కరుణ.అవియే, 1.స్మరత్-మన్మథుడు 2.పురత్-త్రిపురాసురులు 3.భవ-జన్మము 4.మఖము-దక్షుడు 5.గజాసురుడు 6.అంధకాసురుడు 7.యముడు   స్వామి మన్మథుని తన మూడవకంటితో దహించివేశాడు.త్రిపురములను మట్టుపెట్టాడు.పుట్టుక...