KADAA TVAAM PASYAEYAM-22

కదా త్వాం పశ్యేయం-22 ************************* " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం." " కదా వా త్వాం గిరిశ తవ భవ్యాంఘ్రి యుగలం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్టాఘ్రాయ బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే." ఓ గిరిశ! వాక్కులకు అధిపతి, నేను ఎప్పుడు నీ దివ్య పాదపద్మములను గ్రహించి,నా శిరముతో,కన్నులతో,వక్షముతో తాకి,నీ దివ్య పదాంబుజముల సుగంధములను ఆఘ్రాణింపగలను స్వామి.నాకు ఆ భాగ్యమును ప్రసాదింపుము అని పరమేశ్వరుని ప్రార్థిస్తూ,ఈ నాటి బిల్వార్చనమును ప్రారంభిద్దాము. " చిదానంద రూపా-శివోహం శివోహం చిదానంద రూపా-శివోహం శివోహం మనో బుద్ధ్యహంకార చిత్తానినాదం చిదానందరూపా-శివోహం శివోహం "శివోహం " అంటూ శివ స్వరూపమై, శోభాయమానముగా .......అడుగులను కదుపుతున్నది మల్లికార్జున దర్శనమునకై మహోత్సాహము. మంగళవాయిద్యములు,సావధాన ఘోషలతో సహవాసమ...