KADAA TVAAMPASYAEYAM-07

కదా త్వాంపశ్యేయం-07 ***************** " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం." ' ఆమ్నాయాంబుధిమాదరేణ సుమనః సంఘః సముద్యన్మనో మంథనం దృఢభక్తి రజ్జు సహితం కృత్వా మథిత్వా ...." అనుగ్రహించే స్వామిని మన మనోఫలకముపై స్థిరముగా నిలుపుకుని,ఈ నాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము. పంతులు గారు ఏ మంత్రం వేసారో-కనికట్టు చేసారో తెలియదు కాని,గిరిజను చూస్తాను అని బడికి తీసుకువచ్చింది కన్ను తన పని అయిపోయినట్లుగా,చెవికి ఆ బాధ్యతను అప్పగించింది.మూడుకన్నుల వాని మాటను జవదాటగలదా కలలోనైనా. త్రినయనం-త్రిగుణాకారం నమో-నమః. కాసేపు నేను అలా చల్లగాలికి తిరిగివస్తాను అని శంకరయ్యను అక్కడే వదిలేసి చల్లగా జారుకున్నాడు శివయ్య. గురువుగారు,ఏవో శ్లోకాలను చదువుతున్నారు ఉపదేశలహరులను ఉరకలు వేయిస్తూ, శంకరయ్య వంకచూస్తూ నవ్వుతూ, శివయ్య నాతో చెప్పాడు లెండి మీరు వాడిని ఎప్పుడు చూస్తామా? అని బయలు దేరారట. అసహనముగా ఉన్న...