KADAA TVAAMPASYAEYAM-10

కదా త్వాం పశ్యేయం-10 ********************* " జిహ్వ చిత్తశిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం". " ప్రభుః త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః త్వ యైవ క్షంతవ్యాః శివ మత్ అపరాధశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః" అంటూ ఆ దీనబంధువుని మనో ఫలకముపై స్థిరముగా నిలుపుకుని,ఈనాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము. విస్తుబోయి ఆ తుమ్మెదవంక తదేకముగా చూస్తున్న సంకరయ్య కన్ను,తన పనిని చెవికి అప్పగించిందా అన్నట్లుగా, " సకలము నీవేనని తెలియని తెలివిని పెంచి వికలము చేసినవి మనమును తలపులు పొంచి తికమక వీడినది శివ-శివా కటాక్షము మెచ్చి సకలము మీరేనని తెలిపినది శివాభ్యాం నమామి" అని, భృంగికృత శివస్తోత్రమును శ్రావ్యముగా పాడుతూ,పూజముగించుకుని వస్తున్నారు తాతగారు.. అయ్యో-అయ్యో అపచారము తుమ్మెదను చూపిస్తూ మహాదేవుడంటావురా నీవు ,నీ పిల్లచేష్టలు అని మనమని మందలిస్తూ...