SARVA SAUBHAAGYADAAYAKA CHAKRAMU-PARICHAYAMU

" హ్రీంకారస్తు మహామాయా భువనాని చతుర్దశా పాలయంతు ఫలా తస్మాత్ చక్రకోణంప్రవేశ్మితే" పదునాలుగు చక్రకోణములుగా ప్రకటింపబడుతూ,పదునాలుగు భువన భాందములను పరిపాలిస్తున్న పరమేశ్వరికి ప్రణామములు. పరాత్వరి అనుగ్రహముతో మనము , 1.త్రైలోక్య మోహన చక్రము 2.సర్వాశా పరిపూరక చక్రము 3.సర్వ సంక్షోభణ చక్రము నందు అధిష్ఠించి,అనుగ్రహిస్తున్న 1.ప్రకటయోగినిలు 2.గుప్త యోగినులు 3.గుప్త తర యోగినుల సహాయముతో నాల్గవ చక్రమైన 4.చతుర్దశారము/పదునాలుగు త్రికోణములున్న చక్రము లోనికి ప్రవేశిస్తున్నాము. మూడు ఆవరనములో నున్నప్పుడు సాధకుడు, నేను వేరు-పరాత్పరి వేరు అన్న ద్వంద్వ భావములుకలవాడై, అమ్మను ప్రార్థిస్తే సంతసించి,నా ఎదుట ప్రత్యక్షమై నన్ను అనుగ్రహిస్తుంది అన్న వస్తు భావన మిళితమైన వాస్తవములో ఉంటాడు. ఆ భావనకు అనుగుణముగానే మొదటి చక్రమైన భూపురము చతురస్రాకార (ఊహా)మూడు రేఖలు,పదహారుదళముల పద్మము,అష్టదళ పద్మము సాధనా ప్రారంభమునకు వీలుగా,అత్మ తత్త్వ విచారణకు అనుగుణముగా వికసిస్తున్న జ్ఞాన రేకులతో సాధకుని బిందువు చేరుట...