ALO REMBAVAY-15

పదిహేనవ పాశురము. ******************* ఎల్లే! ఇళంగిళియే ఇన్నం ఉరంగుదియో శెల్లెన్మ్రాళే యే మిన్ నంగవీర్ పోదాగిన్రే వల్లై ఉన్ కట్టురైగళ్ పండే ఉన్వాయ్ అరిదుం వల్లీర్గళ్ నీంగళే నానేతాన్ ఆ ఇడుగ ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేరుడయై ఎల్లారుం పోందారో పోందార్ పో ఎణ్ణిక్కుళ్ వల్లానై కొన్రానై మాట్రారై మాట్రళిక్క వల్లానై మాయనై పాడేలో రెంబావాయ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ****************************** ఈ పాశురమును వేదవిదులు" తిరుప్పావాయిలం తిరుప్పావై" గా కీర్తిస్తారు. గోదమ్మ ఈ పాశురములములో మూడు విషయములను ప్రస్తావిస్తు,మూలతత్త్వమును వివరిస్తు,ముముక్షత్వానికి మార్గము చూపిస్తున్నది.కనుకనే ఈ పాశురమును" పరమాద్భుతమా" అంటు ప్రారంభించినది. ఎల్లే!- ఎంత ఆశ్చర్యము పరమాద్భుతము అని తన చిలుకను గురించి(మన గోపికను) ప్రస్తావించుచున్నది. ఇళ్ళంగిళియే-లేత చిలుకా! అంటు మన గోపికను సంబోధించినది. ఇక్కడ మనమొక సంఘటనను ముచ్చటించుకుందాము. చిలుక తనంత తానుగా ఏమియును నేర్వలేనిది కాని పరమాత్మచే చక...