Posts

Showing posts from May 29, 2018

TIRUPAANNAI ALWAR

Image
సంభవామి యుగే యుగే-సాక్ష్యములు హరిఆభరణములు  ధర్మ సంస్థాపనమేలక్ష్యమైన మన ఆళ్వారులు  ఉరైయూరులోని వరివెన్ను నుండి అయోనిజుడుగ  ప్రశంసలతో ప్రకటితమైనది హరి శ్రీవత్సపు అంశ(పుట్టు మచ్చ)  మాల దాసరి ఇంట గోక్షీరముతో  పెరుగుచు  విష్వక్సేనునిచే పంచకర్మ సంస్కారములనందినది  ఆలయ ప్రవేశము లేకున్నను, అద్భుత వీణాగానము  సారంగ ముని భుజమునెక్కి యోగివాహనునిగా చేసెను  పక్కకు తొలగలేదని ఆళ్వారును  రాళ్ళతో కొట్టగా  చక్కని భక్తిని  తెలుపగ స్వామి తాను భరించెనుగా  నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని  పరమార్థము చాటిన  తిరుప్పాణాళ్వారు పూజనీయుడాయెగ. శ్రీ తిరుప్పాణాళ్వారు శ్రీహరి శ్రీవత్సపు 9ఎదమీది పుట్టుమచ్చ) అంశగా గానముతో-వాద్యవిశేషములతో స్వామిని అర్చించు పనర వంశమున,శ్రీ రంగపట్టణ సమీపమునందలి అలకాపురిలో అవతరించెను.తన ఆరాధనలతో పెరుమాళ్ గా ప్రఖ్యాతిగాంచెను. అంటరానితనమును అంటుకొనియున్న నాటి సమాజపు పెద్దలు తిరుపాణ ను ఆలయప్రవేశమునకు అనుమతించలేదు.అంతేకాదు వారు ఉపయోగించుకొను జలతీర్థములను తాకరాదని ఆంక్షలను విధించిరి.వారి...

KULASEKHARA ALWARU

Image
 సంభవామి యుగే యుగే-సాక్ష్యములు  హరి ఆభరణములు   ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన మన ఆళ్వారులు   చేర రాజవంశములో దృఢ మహారాజు పుణ్యము   పుత్రునిగ ప్రకటితమైనది శ్రీహరి  కౌస్తుభమణి   ముదలి ఆళ్వారుచే  పంచ సంస్కారములను పొంది   అవతారములలో  రాముని,అర్చావతారములలో వెంకటేశుని   నిరతము భాగవతులలో  దర్శిస్తూ-సేవిస్తూ   పెరుమాళ్ భక్తి  అనే  పెద్ద మడుగులోని చేపయై   జీవిత నాలుగుదశలను  జీవుడిగా  తరియిస్తూ   "కుల శేఖర పడి" పేరిట గర్భగుడి ముందర గడపగ   నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని   పరమార్థముచాటిన కుల శేఖర ఆళ్వారు పూజనీయుడాయెగ. శ్రీహరి కౌస్తుభమణి అంశయే చేరరాజుకు కులశేఖరునిగా అవతరించినది.స్వామిభక్తులలో సాక్షాత్తు స్వామిని దర్శించి-సేవించగలిగిన మహానుభావుడు.తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి గర్భగుడి గదపగా,"కులశేఖర ఆళ్వారుపడి"గా నేటికిని స్వామిని సేవించుకుంటున్న ముకుందమాలను మనకు ప్రసాదించిన పెరుమాళ్ళు వీరు. జై శ్రీమన్నారాయణ.

TIRUMASAI ALWAAR

Image
అదివో అల్లదివో-తిరుమళిశై ఆళ్వార్  సంభవామి యుగే యుగే-సాక్ష్యములు హరి ఆయుధములు  ధర్మ సంస్థాపనయే  లక్ష్యమైన మన ఆళ్వారులు  తిరుమళిశై నగరములో కనకాంగి-భార్గవ మునికి  చిరు  మాంసపు ముద్దయాయె  శ్రీ హరి సుదర్శనము  లక్ష్మి-నారాయణుల అనుగ్రహము లక్షణ బాలుని సేయగ  పంకజవల్లి-తిరువాలన్ దత్త పుత్రుడాయె ధర్మమై  వృద్ధ దంపతులను కరుణించగ క్షీరమును సేవించి  కణి కృష్ణుని అనుగ్రహించె ఆనందమును కలిగించె  భక్తిసారుడు అనుపేర భగవత్తత్త్వమును చాటగ  తన మూడవ కన్నుతో ముక్కంటితో తలపడెగ  నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని  పరమార్థము చాటిన తిరుమశై ఆళ్వార్ పూజనీయుడాయెనుగ. శ్రీవైష్ణవ సంప్రదాయం ఆయన సాక్షాత్తు శ్రీమహావిష్ణువు చక్రాయుధం, సుదర్శనం అవతారంగా భావిస్తారు. తిరుమళైశాయిలోని జగన్నాథ పెరుమాళ్ ఆలయంలో భగవత్ కృపచే జన్మించారని నమ్ముతారు. తిరువాలన్, పంకయా చెల్వి అన్న పిల్లలు లేని, గిరిజన దంపతులు కట్టెలు కొడుతుండగా బాలుడిని చూసి, ఇంటికి తెచ్చుకున్నారు. దంపతులకు కనికణ్ణన్ అనే మరో కుమారుడు కూడా ఉన్నాడు. అతను తిరుమళిశై...