MEEDHUSHTAMA SIVATAMA-29

మీఢుష్టమ శివతమ-29 *********************** ముక్కనులను సాగరమును కానగలేను ముక్కాలముల గనుము మూఢుని నన్ను దిక్కైన సుగుణ సుగంధాభరణ చక్కని చంద్రుని సిగను దాల్చిన సోమ. రుద్రా! స్థూల-సూక్ష్మ-కారణ శారీరనేత్రములతో ఈ సంసార నిజస్వరూపమును నేను చూడలేని అసహాయుడను. ఎందుకని? అని అంటావేమో ఎదలోని స్థాణువును ఎరుగుటయే మోక్షము, అన్న విషయమును నేను గ్రహించుటకు, అంటే ఏమిటి? సాధకా అడిగాడు రుద్రుడు. అంటే -సర్వము-సమస్తము గుణమయమై అదనముగా ఏది కనబడకుండా,దానికదే కనబడే ఆత్మసాక్షాత్కారము-ఆత్మసాక్షాత్కారము అంటు అర్థిస్తున్నాడు. అప్పుడే వారికి నలుగురు దివ్యపురుషులు అహమన్నం-అహమన్నం-అహమన్నం అహమన్నాద-అహమన్నాద-అహమన్నాద అనుకుంటూ అటుగా వెళుతున్నారు.వారు బాహ్యమునకు అతీతముగా బ్రహ్మమును శోధించుచు-సాధించుటకు-సమగ్రమగుటకు సాగుతున్నారు. సాధకా! అర్థమగుతున్నదా? వారు ఏమంటున్నారో? అన్నము నేనే అంటున్నారు.అన్నము తినేవాడను నేనే అంటున్నారు. ఆశ్చర్యముగా ...