pandits.

నః ప్రయచ్చంతి సౌఖ్యం-25 *********************** భగవంతుడు-భక్తుడు ఇద్దరు పండితులే " నమః శ్లోక్యాయచ-అవసాన్యాయచ." వైదిక మంత్రములందును వేదాంత సారమైన మేథా దక్షిణామూరితి తత్త్వమైన రుద్రునకు నమస్కారములు. " ఓం అక్షరాయ నమః-ఆద్యంతరహితాయ నమః. తిరుమురుక్కరు పాలై రచయిత మధుర తమిళ కవి నక్కీరర్ నమ్మినసత్యమునకు నిలిచి,పరమేశ్వరునే చర్చకు రప్పించెను "తివిలై యడయల్" తెలియగ రానివి దేవుని-జీవుని ఆటలు ఆటకు నాందియైనది అమ్మ "ఘనపూంగదై" పరిమళ సందేహము పరిష్కారమునకై పసందుగ రాజుచే ప్రకటితమైనది బహుమానము పరమేశుడు రాసిన "పద్యము" ప్రవేశించినది ధారుమి చదువగ నక్కీరుడు పట్టిన" దోషము", నడిపించెను శివుని సభకు చర్చకు అతి మూర్ఖత్వమె ఆదిదేవుని అనుగ్రహమునకు కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక. చర్చా అర్చనము నక్కీరుని చిదానందునితో వాదులాడు అవకాశమును కలిగించినది.శివోహం. " ఆపాతాళ నభః స్థలాంత భువన బ్రహ్మాండమావిస్పురత్ జ్యోతిః స్పాటిక ...