AALO REMBAAVAAY-15

పాశురము-15 *********** ప్రతి నాదము- హరి అష్టాక్షరి ప్రతివాదము -హరి స్పష్టాకృతి. పదిమంది గోపికలు ప్రగతికి కరదీపికలు.పరిపూర్ణ వైష్ణవ ప్రతిరూపములు,కొందరు భగవదాదేశము కనుక పరమార్థతత్త్వమును బోధించవలెననుకొనువారు,ఇంకొందరు తమను సమీపించినవారికి సన్మార్గమును చూపువారు,కొందరు తమ ధర్మముగా అడుగకున్నాను ఆదుకోవాలనుకొనువారు, మరికొందరు తమకుతామె కుతూహలముతో కృష్ణసన్నిధిని చేర్చువారు,బహుముఖములుగా భాసించుచు పాశురములుగా మనలను ఆశీర్వదించువారు. లేతచిలుక ప్రస్తావన సంకేతముగా మనలను సంస్కరించబోతున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,గోపికలను మేల్కొలుట యను రెండవ భాగము నందలి చివరి/ప్రస్తుత పాశురమును అనుసంధానము చేసుకుందాము.పది ఇంద్రియములు పరిశుద్ధములైనవి కనుక ఇక వాదోపవాదములుండవు.సూటిపోటి మాటలుండవు.పరాచికములుండవు.పరిహాసములుండవు. లెక్కలుండవు-ఎక్కువతక్కువలుండవు.ఒక్కటే లక్ష్యము.ఒక్కటే లక్షణము.అరమరికలను అధిగమించిన పరిపూర్ణ పారమార్థికము. ఎల్లే! ఇళంగిళియే ఇన్నం ఉరంగుదియో శెల్లెన్మ్రాళే యే మిన్ నంగవీర్ పోదాగిన్రే వల్లై ఉన్ కట్టురైగళ్ పండే ఉన్...