ANIRVACHANEEYAM ADITYAHRDAYAM(PRAJA-PRANA)-10
.jpg)
పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః । వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ॥ 9 ॥ పితరో నమః *********** పరమేశ్వరుని ఇంద్రియములే/శక్తులే దేవతలు అని పెద్దలు చెబుతారు.ప్రస్తుత శ్లోకము గనములకు సంకేతమైన బహువచనమును అన్వయించుచున్నది. పితృగణమును-వసుగణమును,సాధ్యగణమును,అశ్వినీదేవతలను ఇద్దరిని,మరుత్ గణములను,మనుగణములను,వాయుగణములను,వహ్నిగణములను,ఋతుగణములను,ప్రభాకిరణములను ప్రస్తావించుచున్నది. రుద్రములో చెప్పినట్లు"పత్తీనాం పతయే" మార్గములను ఏర్పరచి నడిపించుపరమాత్మ కిరణ సమూహములే బహు రూపములతో,తత్త్వములతో సమీకరింపబడుతూ సహాయపడుచున్నవి. పితరో నమః ********* " మాతాచ-పితాచ పితరో" ఆర్యోక్తి.తల్లి-తండ్రులే పితరులు. జీవునికి జన్మజన్మలయందు ఉపాధికి తగిన అనుగుణమైన ఆహారమును అందించు వ్యవస్థయే పితృదేవతా వ్యవస్థ. పితృయానమునకు సహాయపడు కిరణ సమూహములు. సనాతన ధర్మముననుసరించి ఉపాధిని వీడిన జీవుడు వసు రూపమును,రుద్ర రూపమును,ఆదిత్యరూపమును క్రమముననుసరించి పొందుతాడని దానికి అనుగుణమైన కర్మలను ఆచరించవలసిన బాధ్యత వారసులదని నమ్ముతుంది.ఒక విధముగా జీవుల వివిధ ఉప...