KALIKAMBA NAAYANAAR
కలికాంబ నాయనారు *************** " నీ పాదకమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంతాపార భూత దయయును తాపస మందార నాకు దయసేయకదె" సహజకవి బమ్మెర పోతన. ఆదిశంకరులు అమ్మ వారి పాదరేణువు మహాత్మ్యమును సౌందర్యలహరి స్తోత్రములో ప్రస్తావిస్తూ,ప్రశంసించిరి. అన్నమాచార్చార్యులు సైతము, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మమురా నీ పాదము అని సర్వాంతర్యామి పాదపద్మములను సన్నుతించిరి. నవవిధ భక్తులలో నాల్గవదైన పాదశేవనము భక్తుని నిరహంకార నిశ్చల మనోసేవలకు ప్రతీకగా అనుకోవచ్చును. సామాన్య భాషలో చెప్పుకోవాలంటే మనసు చపలత్వముతో అటు-ఇటు జరుగవచ్చును /అహంకారమునకు దాసోహమవ వచ్చును కాని,నిండైన విస్తరి నెమ్మదిగానే ఉంటుంది అన్నట్లుగా నిరంతరము శరీరమును మోస్తున్నప్పటికిని,నడుస్తున్నప్పటికిని,పరుగులు తీస్తున్నప్పటికిని లేదా స్థిరముగా నున్నప్పటికిని అన్ని అవస్థలను సమానముగానే స్వీకరిస్తూ,సహనముతో ఉండేవి పాదములు. స్వామి అంఘ్రియుగళ సేవనము సూచిస్తూ శ్రీదేవులపల్లి వారు సైతము, శివపాదము మీద నీ శిరమునుంచరాదా అని , అహంకార-మమకార పోరాటములలో అహంకారము తొలగాలంటే అది మమకారమును ఆశ్రయించవలసినదే.దాన...