Posts

Showing posts from April 29, 2020

CHAMAKAMU-ANUVAAKAMU-06

  శివుని కరుణ అర్థముకానిది.శివుని కరుణ అద్భుతమైనది. " రుద్రం సురనియంతారం శూల ఖట్వాంగధారిణం   జ్వాల మాలా వృతం ధ్యాయేత్ భక్తానాం అభయప్రదం."    దేవతలను కూడ నియమించు రుద్రుడు సాధకులకు శుభములొసగును గాక. మేఘములందు మెరుపు-ఉరుము-పిడుగు రూపముగా విరాజిల్లుతూ రుద్రుడుసృష్టి/వృష్టి రూపముగా ప్రసన్నుడై భూమిని ఫలవంతము చేయుచు,ఇంద్రరూపముగా కీర్తింపబడుతున్నాడు.    రుద్రుడు ఇంద్రియములకును-మనసునకును అధిపతి.వానిని అనుభవించునపుడు ఇంద్రునిగను-నియమించునపుడు రుద్రునిగను చెప్పబడును.   అర్థ ఇంద్ర అనువాకముగా ప్రశస్తి చెందిన అనువాకము ముఖ్యముగా కార్య-కారణ సంబంధమును సోదారహరణముగా తెలియచేస్తున్నది.అంతే కాకుండ మొదటి అనువాకము అగ్నా- విష్ణో అంటూ, ఇద్దరిని కలిపి అనుగ్రహహించమని ప్రార్థించుటతో సత్వర సమిష్టి ఫలితములను పొందవచ్చునన్న వేద సంప్రదాయమును మరొకసారి ప్రతిపాదించుచున్నది.ఈ ఇద్దరిలో రెండవ వారిగా సంబోధింపబడుచున్న ఇంద్ర శబ్దము మూలము.దాని ఆదేశముననుసరించి మొదటి శబ్దమైన అగ్ని,వరుణ మిత్ర మున్నకు దేవతా శక్తులు మన ప్రార్థనలను స్వీకరించి,ప్రస...

CHAMAKAMU-ANUVAAKAMU-05

Image
  శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.    ఈ అనువాకము భూమి యొక్క గొప్పదనమును -భూగర్భ సంపదలను ప్రస్తావిస్తూ,జీవుడు పరిపూర్ణతను సంపాదించుకొనుటకు పరమాత్మ కోరినకోరికలను తీర్చే కొంగుబంగారము సాధకుని యజ్ఞమును సమర్థవంతము చేయాలనుకుంటున్నాడు.    మనము ఒక మహావృక్షమును సామాన్యదృష్టితో చూసినపుడు మనకు భూమిపైన ఉన్న కాండము-కొమ్మలు-ఆకులు-పూలు-పళ్ళు మాత్రమే కనిపిస్తాయి కాని,వాటన్నిటికి మూలకారణమైన మహిమాన్వితమైన వేరు కనపడదు.అంతమాత్రమున వేరులేదనగలమా? అదే విధముగా మన చర్మనేత్రములు భూభాగ ఉపరితలమును మాత్రమే వీక్షించగలవు కాని భూగర్భ సంపదను ఆలోచించలేవు.అర్థముచేసుకొనలేవు.ఇక స్వామిని అర్థించ గలవా? సాధ్యము కానే కాదు. అందుకే స్వామి ఘోర-అఘోర రూపములకు సంకేతముగా "అశ్మాచమే-మృత్తికాచమే" అంటూ కఠినమైన రాయి కావాలి-మెత్తనైన మట్టి కావాలి" అని అర్థింపచేస్తూ,అభీష్టసిధ్ధిని కలిగించాలనుకుంటున్నాడు.  భూమిని దున్నిన భూమి-దున్నని భూమి " "కృష్ణ పశ్యంచమే-అకృష్ణ పశ్చమ్యచే" అంతూ వర్గీకరించి కొన్ని భూములను ఆహారదాతలుగాను,మరికొన్నింటిని ఆవాస (ఇల్లు) దాతలుగాను ,ఆ భూములు అందించే సంపదలను కోరుక...

CHAMAKAMU-ANUVAAKAMU-04

Image
  శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.   జీవుల మేథను విస్తరింప చేస్తూ ధాన్యము యొక్క నాణ్యత ను వర్గీకరింపచేస్తూ " ఊర్క్సమే" అంటూ సామాన్య ధాన్యమును పరిచయము చేసాడు.అంతే కాదు సిరి ధాన్యములను ప్రస్తావింప చేసాడు " యవాశ్చమే-మాషాశ్చమే-తిలాశ్చమే అంటు రాగులను,మినుములను,నువ్వులను ఇంకా అనేకానే సిరి ధాన్యములను ఆవిష్కరిమచేసినది ఈ అనువాకము.    ధాన్య రకములనే కాక వాటి పరిమాణములోని వైవిధ్యమునుకూడ 1.రాశి.చిన్న రాశి.3.పెద్ద రాశి.4. చాలా పెద్ద రాశి.5.పూర్ణ రాశి అంటు " విభశ్చమే-ప్రభశ్చమే-బహుశ్చమే-భూయశ్చమే-పూర్ణశ్చమే అంటు ప్రస్తుతిస్తూ.   ఘన ఆహారముతో పాటు ద్రావకములను/పానీయములను కూడ జోడించి పాలు-నేయి-తేనె మొదలగు వానిని "పయశ్చమే-ఘృతశ్చమే-మధుశ్చమే" అంటు జీవుని యజ్ఞసాఫల్యతకై లభ్యమయేలా చేసినది.   పండ్లను అర్థించి స్వీకరించుటకై పచ్చని చెట్లను,గుబురు పొదలను నమకములో చెప్పినట్లు " వృక్షాశ్చమే" అని జీవుని కోరుకొమ్మని యజ్ఞసామాగ్రిని పరిపూర్ణము చేసుకోమని సూచిస్తున్నది. అన్న-పానీయములను అందించుటకు సిధ్ధమైన తరువాత "రయశ్చమే-రాయశ్చమే" అంటూ, బంగారమున...