PRARTHANA

ప్రార్థన ********** శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రణవం వందే రమ్యజా మాతరం మునిం లక్ష్మీనాథ సమారంభం నాథయామున మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహతస్తత్ ఇతరాణి తృణాయమానే అస్మద్గురో భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరం శరణం ప్రపద్యే. సంభవామి యుగేయుగే సాక్ష్యము హరి కళత్రము ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన ఆండాళ్ తల్లి అనుగ్రహము. శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తీయుని పుణ్యముగా పసిపాపగ ప్రకటించబడినది తులసివనములో విష్ణుకథాశ్రవణము-పుష్పమాలాలం కరణములు వివాహమాడదలచినది స్వామిని స్థిరచిత్తముతో గోపకన్యగా మారినది-గోపికలను పిలిచినది తిరు పాశురములు వ్రాసినది-వ్రతములు చేసినది చూడికొడిత్తాల్ మనకు మోక్షమార్గము చూపించినది రంగనాథుని దేవేరిగా శ్రీరంగమున కొలువైనది నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని పరమార్థము...