TIRUPPAAVAI-PAASURAM-22

పాశురము-22 తిరుప్పావై-పాశురము-22 **************** నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్నం పారార్థం స్వసృతిశతసిర స్సిధ్యమధ్యాపయంతీ స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యాబలాత్ కృత్యభుంగ్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తుభూయః పూర్వపాశుర ప్రాభవము **************** నందగోపుని ఔదార్యము,స్వామి అవతార ధర్మమును గుర్తు చేస్తూనే పెరియాయ్ అని బృహత్స్వరూపమును కీర్తించటము,శత్రువులు శరనాగతికై ద్వారము దగ్గర నున్నారనిచెబుతూ గోపికలు తాము సైతముపరమాత్మ గుణవైభవమునకు ఓడి,వశులై సేవించుటకు,స్వామినికి దిష్టి తగులకుండా,మంఘళ ఆశాసవమునలతో సేవించుకొనుటకు వచ్చామని,తేజోవతమైన స్వామిచీకటికి నిదురించుట విరోధ స్వభావమని చెప్పిన గోదమ్మ, ప్రస్తుత పాశుర ప్రాభవము ************************** 1 స్వామినేత్రవిసనసౌందర్యమును వారికి అనుగ్రహించమనియును, 2 వారు స్వామి యున్న మందిరమునలోనికి ప్రవేశించినామనియును, 3.స్వామి మీ గొప్పతనమా అని అడిగినట్లు భావించి,జవాబుగా, నీలమ్మ పురుషకారత్వము,తామున్న అభిమాన రాహిత్యముకృష్ణా నీ సన్నిధికి మమ్ము చేర్చినవి అని బదులిచ్చిరి. గోపికలు, శరీరమే ఆత్మ, నేను/మేము సర్వస్వతంత్రులము పరమాత్మకు దాస...