PAAHIMAAM PARAMESVARI-PRANATOSMI SADAAMAHAM.

పాహిమాం పరమానుగ్రదాయిని పరమేశ్వరి ****************************** " ధ్యాయేత్ కాళీం మహామాయాం త్రినేత్రాం బహురూపిణీం చతుర్భుజాం లలజ్జిహ్వం పూర్ణచంద్రనిభాననాం నీలోత్పలదళ శ్యామాం శత్రుసంఘవిదారిణీం నరముందం తథాఖడ్గం కమలంచ వరంతథా." అంటు సుమేథ మహర్షి సూరథ-సమాథులకు ఈ విధముగా చెప్పసాగెను. " ఏభిఃహతైజగదుపైతి సుఖం తథైతే కుర్వంతునామ నరకాయ చిరాయ పాపం సంగ్రామ మృత్యుమధిగమ్య దివం ప్రయాంతు మత్వేతి సూనమహితాన్ వినిహంసి దేవి" అసురులందరు పాపములను చేయుచు ఫలితముగా నరకమునకు పోవలసిన వారలే అయినను తల్లి వారిని తన కరుణతో పుణ్యలోకప్రాప్తిని కలిగించుటకా యన్నట్లు, ఆ రణభూమిలో బ్రహ్మాణి తన కమందలములోని జలమును చున్నది.రాక్షబలమును/రాక్షస గణములను/గుణములను తగ్గించుచున్నది.మాహేశ్వరి త్రిశూలముతోను,వైష్ణవి చక్రముతోను,కౌమారి శక్తితోను,ఐంద్రి వజ్రాయుధముతోను,తమ విధులను నిర్వర్తించుచుండగా, ప్రక్షిప్తము-నిక్షిప్తము తన కనుసన్నలైన అంబిక రక్తబీజుని వెటకారమునకు సమాధానముగా సప్తమాతృకలను నిక్ష...