AALO REMBAAVAAY-29

శాత్తుమరై పాశురము-29 ****************** "ఆలకించనీయననదు నీ అనురాగపు ఆంతర్యము ఆలసించగనీయదు అనుమతింప నిత్యకైంకర్యము" మంగళప్రదమైన పాశురములో ఇష్టప్రాప్తి-అనిష్ట నిర్మూలనము ను స్పష్టము చేయించి ఇటు ఏడుతరములను-అటుఏడు తరములను స్వామి అనుగ్రహప్రాప్తులను (మన పూర్వీకులను-ఉత్తర వంశస్థులను) ఉద్ధరించుటయే కాక,రంగనాధుని అనుగ్రహమును పొంది-కొత్త పెళ్ళికూతురుగా ముస్తాబవబోతున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,వారనుగ్రహించనంతమేరకు (వింజామర) పాశురమును అనుసంధానము చేసుకునేందుకు ప్రయత్నమును చేద్దాము. ఇరువది తొమ్మిదవ పాశురం ********************** శిత్తం శిరుకాలే వందు ఉన్నై చ్చేవిత్తు ఉన్ పొత్తామరై అడియే పోత్తుం పొరుళ్ కేళాయ్ పెత్తం మేయ్ తుణ్ణం కులత్తిల్ పిరందు నీ కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు ఇత్తైపరై కొళివాన్ అన్రుగాణ్ గోవిందా ఎత్తెక్కుం, ఏళేళు పిరవిక్కుం ఉందన్నోడు ఉత్తోమేయావోం; ఉనక్కేనాం,అత్చెయ్ వోం మత్తైనం కామంగళ్ మాత్తు ఏలోరెంబావాయ్. గోపికలు ప్రథమ పాశురము నుండి స్వామి పఱ ను తమకు అనుగ్రహిస్తాడని-దానిని స్వీకరించి నోమును ...