TANOYU NAH SIVAH SIVAM-24@SIVATANDAVASTOTRAMU
.jpg)
" వాగర్థావివ సంవృకౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" కథానుసారముగా , లలాట చత్వర శ్లోకములో "నః" అంటూ నమస్కారముతో భక్తికి బీజమువేసినాడు పరమేశ్వరుడు. కరాళఫాల పట్టిక శ్లోకములో ఆ భక్తి బీజము మొలకెత్తి మతిః మమ -ఆనమస్కారము మతిర్మమ-మనస్పూర్తిగాచేయునది కావాలనిపించాడు.అప్పుడు ఆ నమస్కారము కేవలము ఆంగికము కాదు.మనసును కలుపుకొనిన మానసిక-ఆంగికమైనది.ఆ నమస్కారము స్వామిని శ్రియం జగస్షురంధరునిగా దర్శింపచేస్తున్నది మొలకమొక్కగా మారి. ఏమిటి ఆ జగద్ధురంధరత్వము అను ఆలోచనమును రేకెత్తించినది.ద్వంద్వములను వేరువేరుగా చూపిస్తున్నది ఆ మొక్క వేసిన మొగ్గ. మొగ్గ పువ్వుగా పరిమళములు చిందుతూ స్వామి ద్వంద్వములను వేరువేరుగా చూపుటయే కాదు నీ మీది అనుగ్రహముతో వాటిని అంతమొందించి నీకు న-ద్వైత ఏకం సత్ అని తెలియచేస్తూ,ఫలవంతమై నీ భజనమునకుమరింత మెరుగులు దిద్దుచున్నది.ప్రపంచ కాలిమత్వము ప్రకాశత్వమును "దృషద్విచిత్ర తల్పయోర్భుజంగ మౌక్తిక స్రజో గరిష్ఠ రత్నలోష్ఠయో సుహృద్విపక్ష యోః తృషారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్ర...