CHAKRESVARI-PARICHAYAMU
.jpg)
" కదంబ వనవాసినీం కనకవల్లకీ ధరిణీం మహార్ణమణిహారిణీం ముఖసముల్లస్ద్వారుణీం దయా విభవకారిణీం విశదరోచనాచారిణీం త్రిలోచచన కుటుంబుణీం త్రిపురసుందరీం ఆశ్రయే." శ్రీచక్రములో బిందురూపముగా ఏకాత్మకమైనపరమాత్మ,సృష్టిచేయ సంకల్పించి కామేశుడై, మహత్తు-అహంకారము శివశక్తులు స్థావర-జంగమము ప్రకృతి-పురుషులు గా ప్రకటింపబడుతూ, పంచకృత్యాసక్తులై, పురోభవ గా శ్లాఘింపబడు పరమేశ్వరి, మూడు అవస్థలను-జాగ్రత్-నిద్రా-సుషుప్తులను మూడు కాలములను-భూత-వర్తమాన-భవిష్యత్తులను మూడుకూటములను-వాగ్భవ-మధ్య-శక్తి మూడు కార్యములను-సృష్టి-స్థితి-సంహారములను మూడు గుణములను-సత్వ-రజో-తమో గుణములను విస్తరించి తాను పర్యవేక్షించుచున్నది. ఆ పరాశక్తియే ఒక ఆనందమయ దివ్యరూపమును సంతరించుకున్నది కనుక"త్రిపురసుందరి"గా,సర్వాంగసుందరిగా సంకీర్తింపబదుతుంది. సర్వాంగసుందరి నవావరనములలో తన వంటి రూపురేఖా లావణ్యములు కలిగిన త్రిపురలను విస్తరింపచేసి నవమావరనములో తాను మహాత్రిపురసుందరిగా పూజింపబడుతున్నది. త్రిపురాను ఉపసర్గనుపొందిన, 1.త్రిపుర ...