Posts

Showing posts from December 5, 2021

SERUTANAAY NAAYANAARU

" పుష్ప మూలే వసేత్ బ్రహ్మ మధ్యేచ కేశవ పుష్పాగ్రేచ మహాదేవ సర్వదేవ స్థితో దళే" చిదానందరూపా-శేరుతనాయ్ నాయనారు. కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా స్థిరమగు భక్తియను తిరువిరులను మాలగ తాను అల్లు సమర్పణమును చేసి ,సాష్టాంగము మోకరిల్లు కామేశుని ఆన కాన కాదనలేని విధంబున కదిలిరి రాజుయు-రాణియు కథ నడిపించు పథంబున లీలగ,పూమాలల సుగంధము బంధము వేయగ హేలగ చేతబూని వాసనచూసెను రాణి నాసిక అపరాధము చేసెననుచు నాసిక కోసెను సెరుత్తనాయి ముక్తిని పొందగ రాణి ముక్కును కోయుట కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తము చేయు శివోహం జపంబు నా చింతలు తీర్చును గాక. భగవంతుడు పుష్పములలో నిండి,కరుణతో వాటిని వికసింపచేయుచు,చూసి సంతసించుటను ఆధారము చేసుకొని పుష్పముల ద్వారా మనకు అర్థము-సౌఖ్యము-సాక్షాత్కారము అను మూడు దివ్య మహిమలకు శివుని చేతినున్న త్రిశూలములోని మూడు విభాగములను ప్రతీకగా కొలుస్తారు.భక్తులు.అతి స్వల్పకాలములో మనకు జగతి సృష్టి-స్థితి-లయములను వాటిని జరిపించే పరమేశ్వర తత్త్వమును చాటిచెబుతాయి పుష్పములు.అంతే కాదు.శబ్ద-చెవి,స్పర్శ -చర్మము,గంధ-నాసిక,రూప-న...

TIRU KORIPPU TONDA NAAYANAARU.

వార్ధక్యే చేంద్రియాణాం వికలగతిమతశ్చాధిదైవాదితాపైః ప్రాప్తై రోగైర్వియోగైర్వ్యసనకృశతనోర్‍జ్ఞప్తిహీనం చ దీనమ్ మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యం క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో " చిదానందరూపా-తిరు తొండ నాయనారు. *************************************** కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా తిరు కురిప్ప తొండ నాయనారు నియమము రజకవృత్తి యందే యతిరాజ భక్తి సంయమనము మాసిన బట్టల మసిపూతలరేడు ఆ చాకిరేవులో వ్రత భంగము చేసినాడు కురిపించిన జోరువానలో అపరాధము జరిగినదని ఆ బండరాయికే, తన తలను బాదుకొనుటయే సరియనినాడు వెంటనే తగదని-నిలుమని కనపడి, కపర్ది కరుణించగ తరియించగ నాయనారు తలబాదుకొనుటయే కారణమాయెగ చిత్రము గాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబు చింతలుతీర్చుగాక. తిరుకొరిప్పు తొండనాయనారు. తిరు అరాధ్యుడు కొరిప్పు క్రమశిక్షణ ఏ సమయమునకు ఏ విధముగా శివునికి వేనితో అభిషేక-అర్చనాదులనులను జరుపుటలో క్రమమును పాటిచెడివాడు కనుక తిరు కొరిప్పు తొండ నాయనారుగా ప్రసిధ్ధిగాంచెను. కాంచీ పురమునందు వల్లారు కుట...

KULACHCHIRAAYI NAAYANAARU

కులచ్చిరాయ్ నాయనారు ********************** పాండ్యరాజ్యములో రాజవంసమున మన్మేల్కుడి యందు జన్మించిన కులచ్చిరాయి నాయనారు జైనము రాజును-రాజ్యమును ప్రభావితముచేయుహున్న సమయమునందున్న గొప్ప శివభక్తుడు.ప్రధానమంత్రి.మహారాణి తిరుమంగై కరసి నాయనారు తక్క మిగిలిన వారందరు జైనమతమునకు దాసోహమయిన వారే.అప్పటి మత ఉద్రిక్తత మహారాణిని విభూతిధారనను చేయలేని ఆక్షలను విధించినది. మహారాణి-ప్రధానమంత్రి మతవిద్వేషములను అణచివేయుటకు ప్రయత్నించినప్పటికిని, ముదిరిని వ్యాధిని కుదిరించే మందును ఇచ్చేవారు కనరాక యున్న సమయమున , మహారాణి మనో వేదనకు ఉపసమనమా అన్నట్లుగా, వేదారణ్యేశ్వర స్వామి వారి ఆలయ త్ద్వారములు వేదనాభరితములై బిగిసిపోయినవా అన్నట్లు తెరుచుకొనుట మానివేసినవి. మానవనేత్రములకు మాములు మనుషులకు తెలియచేసేందుకేమో మహనీయుల రాకకై వేయికన్నులతో వేచి చూచుచున్నవి. వేకువ రేఖలుగా అప్పార్-జ్ఞాన సంబంధర్ తమ పాదమును మోపి ,తమ నామ సంకీర్తనముతో ,విషపూరిత విచక్షణారాహిత్యముపై తమ అమృతాభివర్షమును కురిపించి అజ్ఞానమును తొలగించివేశారు.మహాద్భుతము మూసిన తలుపులు.మూఢుల తలపులను తెరిపిస్తూ,తమంతట తామె తెరుచుకున్నవి. మహారాణి చెవికి సోక...