SERUTANAAY NAAYANAARU
" పుష్ప మూలే వసేత్ బ్రహ్మ మధ్యేచ కేశవ పుష్పాగ్రేచ మహాదేవ సర్వదేవ స్థితో దళే" చిదానందరూపా-శేరుతనాయ్ నాయనారు. కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా స్థిరమగు భక్తియను తిరువిరులను మాలగ తాను అల్లు సమర్పణమును చేసి ,సాష్టాంగము మోకరిల్లు కామేశుని ఆన కాన కాదనలేని విధంబున కదిలిరి రాజుయు-రాణియు కథ నడిపించు పథంబున లీలగ,పూమాలల సుగంధము బంధము వేయగ హేలగ చేతబూని వాసనచూసెను రాణి నాసిక అపరాధము చేసెననుచు నాసిక కోసెను సెరుత్తనాయి ముక్తిని పొందగ రాణి ముక్కును కోయుట కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తము చేయు శివోహం జపంబు నా చింతలు తీర్చును గాక. భగవంతుడు పుష్పములలో నిండి,కరుణతో వాటిని వికసింపచేయుచు,చూసి సంతసించుటను ఆధారము చేసుకొని పుష్పముల ద్వారా మనకు అర్థము-సౌఖ్యము-సాక్షాత్కారము అను మూడు దివ్య మహిమలకు శివుని చేతినున్న త్రిశూలములోని మూడు విభాగములను ప్రతీకగా కొలుస్తారు.భక్తులు.అతి స్వల్పకాలములో మనకు జగతి సృష్టి-స్థితి-లయములను వాటిని జరిపించే పరమేశ్వర తత్త్వమును చాటిచెబుతాయి పుష్పములు.అంతే కాదు.శబ్ద-చెవి,స్పర్శ -చర్మము,గంధ-నాసిక,రూప-న...