TIRUPPAAVAI-PAASURAM 11

తిరుప్పావై -పాశురము 11 **************** " మాతః సముత్థితివయీ మది విష్ణుచిత్తం విశ్వోపజీవ్యమమృతం వచసా దుహానాం తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం సంతః పయోధిదుహితః సహజాంవిదుస్తాం." పూర్వ పాశుర ప్రస్తావనము ****************** కృతకృత్య యైన గోపిక తనను తాను మనోయజ్ఞ హవిస్సుగా మలచుకొని,స్వామిని భోక్తను చేసినది.తులసి సైతము తనను తాను పరిమళముగా మలచుకొని స్వామిచే అలంకరింపబడినది. కుంభకరణ పదము అగస్త్యమహర్షిని సంకేతిస్తున్నదని భాష్యకారులు వివరించారు. అసలు ఐదవ గోపికను అగస్త్యమహర్షి తో ఎందుకు పోల్చినది గోదమ్మ అన్న సందేహము తప్పక వస్తుంది.పరిహాసముగా 'కుంభకర్ణుని జయించి,నిద్దురను స్వాధీనము చేసికొనినది అన్నప్పటికిని ఆమెది సకలేంద్రియములను ఏకీకృతము చేసి స్వామి లీలాగుణవైభవములను అనుభవిస్తున్న ఉత్త అధికారిణి. సత్వగుణ శోభితమైన ఉపాధి కలది శ్రీరామావతారము.శ్రీరాముడు జన్మించినప్పటినుండి అవతార పరిసమాఒతి వరకు ఎటువంతి మానవాతీత లీలలను ప్రకటించలేదు.తన అవతార పరిసమాప్తి సమయమున తన ఆయుధములను-పరివారమును సంకేతములుగా/సూక్ష్మరూపములలో...