Posts

Showing posts from October 3, 2019

PADISAKTULA PARAMAARTHAMU-edAVAsAKTI-DHOOMAVATI.

Image
 పదిశక్తుల పరమార్థము- ఏడవశక్తి-ధూమవతి.  ***********************************  " ఏకం సత్ " విప్రా బహుదా వదంతి.    ఒకే పరమాత్మ.విప్రులు అనగా ఒక కులము అనికాదు.విశేష పాండిత్యము గలవారు.వారు తమ జ్ఞానమునకు బుధ్ధిని జోడించి అమ్మదయతో దాని స్వరూప-స్వభావములను తమదైన రీతిలో మనకు అందిస్తున్నారు.   ధూమవతి తల్లి ఏకంసత్ కనుకజీవిపుట్టుక ముందు మరణము తరువాత స్థితి అంటున్నారు.జనన మరణములు రెండు మానవప్రవృత్తులు.త్యజించవలసిని తనువు గలిగినవన్నీ (మరణించవలసిన) మానవులే సకలజీవరాశులు.    గుర్రము లేని రథము లో తల్లి కూర్చుంటుంది.అంటే మనసనే పరుగులు దానిని నియంత్రించవలసిన పగ్గములు అవసరములేనిది.స్థితి-గతులకు అతీతమైన సమాధిస్థితి.   అసురుల పచ్చిమాస భక్షణము మనలో అసురీభావములను మొగ్గలోనే తుంచివేయు కారుణ్యము.    తల్లిచేతిలోని చేటతో తేలిపోవు ఇహములను పొట్టును చెరిగివేసి,శాశ్వతాన0దము మనకు చేటలో చూపించుట.చెరుగుట నిత్య-నిశ్చల సాధన అను క్రియాశీలత.   దాగి ఉన్న నిప్పును పరిచయము చేసేది పొగ..అదే ఈ తల్లి తత్త్వము.స్వయం ప్రకాశక తల్లి మనముందు మాయ అనే పొగను మనము...

PADISAKTULA PARAMAARTHAMU-CHINNAMASTAKA

Image
   పదిశక్తుల పరమార్థము-ఆరవ శక్తి-ఛిన్నమస్తక.    ************************************   అమ్మ అనుగ్రహముతో మనము ఆరవశక్తియైన ఛిన్నమస్త తత్త్వమును అర్థముచేసుకొనుటకు ప్రయత్నిద్దాము.ఇక్కడ మనము ముచ్చటించుకొనవలసిన విషయములు మూడు. అవి తల్లి మనకు పరిచయము చేసినవి. 1.నాడీవ్యవస్థ.   భైరవితత్త్వములో జాగృతమైన కుండలినీశక్తి సహస్రారముదాక సుషుమ్న అను నాడిద్వారా చేరుతోంది.అదియే కాక అమ్మకు ఇరువైపుల నున్న శక్తులను ఇడ-పింగళ నాడులుగా వివరిస్తున్నారు.వీటిలో సుషుమ్న ఆహారశక్తియై మూడువిభాగములుగా మారి రక్తధారలను అందించుచున్నది. 2.తల్లి మనకు నాడీమండలమును పరిచయము చేస్తూ,దానిని మనలోని సత్వ-రజో-తమోగుణ ప్రతీకలుగా వివరిస్తున్నది.కోపమును తెలియచేయు ఇడానాడిని రజోగుణముగా,అజ్ఞానమును తెలుపు నల్లని నాడిని తమోగుణ సంకేతముగా ప్రకటిస్తున్నది.ఆరెంటిని పోషించుతు తనకు తాను పోషించుకోగల స్వయంపోషకశక్తిగా,సత్వగుణ ప్రకాశిగా సుషుమ్నానాడిని చూపిస్తోంది. 3.నాడీమండలములోని మూడునాడులను-త్రిగుణములను పరికరములుగా మలచి,అమ్మ మధువిద్యా తత్త్వమును మనకు చెప్పుచున్నది.శుధ్ధసత్వస్థితిని రజో-తమో గుణములు ఏ...

PADISAKTULA PARAMARTHAMU-BHAIRAVI

Image
********************* అమ్మ అనుగ్రహముతో ఈ రోజు మనము భైరవీతత్త్వమును అర్థము చేసుకొనుటకు ప్రయత్నిద్దాము. మొట్టమొదట అమ్మ నివాసము మూలాధారము.అంటే ఆ ప్రదేశములో కుండలినీ శక్తి తటస్థముగా నిద్రపోతుంటుంది.అంతా చీకటి.జంతుతతుల వెన్నెముక అడ్డముగా నుండుట వలన అవి నిటారుగా లేచి నిలబడలేనట్లు,మన మనసులలోని చైతన్యము తటస్థముగా ఉంటుంది.దానికి ఎటువంటి ఆశలు-ఆశయాలు-ఆచరణలు ఉండవు.నల్లమబ్బు కమ్ముకొనిన ఆకాశము వలె ఉంటుంది.అప్పుడు మనలను అనుగ్రహించేది భైరవీశక్తి. శబ్ద-ప్రకాశ (ఉత్కృష్ట) సంకేతములతో నల్లమబ్బులను చెల్లాచెదరుచేసి ప్రకటింపబడు అందమైన మెరుపు వంటి (ఇక్కడ మెరుపు జ్ఞానము.రూపము కాదు) మనసుకు-శరీరమును అనుసంధానము చేస్తూ,మనకు దశేంద్రియ జ్ఞానమును ప్రసాదిస్తుంది.అవే కన్ను-ముక్కు-నాలుక-చెవి-చర్మము వాటిని శక్తివంతము చేయు శబ్ద రూప స్పర్శ రస గంధాదులు. భైరవీ మాత ఈ పది ఇంద్రియములను పనిముట్లగా మలచి ఆత్మతత్త్వమును అర్థముచేసుకొను అభ్యాసమును ప్రారంభించమంటుంది. భైరవీమాతా చరణారవిందార్పణమస్తు. Like Show more reactions