PADISAKTULA PARAMAARTHAMU-edAVAsAKTI-DHOOMAVATI.

పదిశక్తుల పరమార్థము- ఏడవశక్తి-ధూమవతి. *********************************** " ఏకం సత్ " విప్రా బహుదా వదంతి. ఒకే పరమాత్మ.విప్రులు అనగా ఒక కులము అనికాదు.విశేష పాండిత్యము గలవారు.వారు తమ జ్ఞానమునకు బుధ్ధిని జోడించి అమ్మదయతో దాని స్వరూప-స్వభావములను తమదైన రీతిలో మనకు అందిస్తున్నారు. ధూమవతి తల్లి ఏకంసత్ కనుకజీవిపుట్టుక ముందు మరణము తరువాత స్థితి అంటున్నారు.జనన మరణములు రెండు మానవప్రవృత్తులు.త్యజించవలసిని తనువు గలిగినవన్నీ (మరణించవలసిన) మానవులే సకలజీవరాశులు. గుర్రము లేని రథము లో తల్లి కూర్చుంటుంది.అంటే మనసనే పరుగులు దానిని నియంత్రించవలసిన పగ్గములు అవసరములేనిది.స్థితి-గతులకు అతీతమైన సమాధిస్థితి. అసురుల పచ్చిమాస భక్షణము మనలో అసురీభావములను మొగ్గలోనే తుంచివేయు కారుణ్యము. తల్లిచేతిలోని చేటతో తేలిపోవు ఇహములను పొట్టును చెరిగివేసి,శాశ్వతాన0దము మనకు చేటలో చూపించుట.చెరుగుట నిత్య-నిశ్చల సాధన అను క్రియాశీలత. దాగి ఉన్న నిప్పును పరిచయము చేసేది పొగ..అదే ఈ తల్లి తత్త్వము.స్వయం ప్రకాశక తల్లి మనముందు మాయ అనే పొగను మనము...