NA RUDRO RUDRAMARCHAYAET-28

న రుద్రో రుద్రమర్చయేత్-28 ****************** "" ఇళాపురే రమ్య విశాల కేస్మిన్ సముల్లసం తం చ జగద్వరేణ్యం వందే "మహోదార తర" స్వభావం ఘృశ్మేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే" స్వామి మహా ఔదార్యమును చెప్పకనే చెబుతున్నది పై ధ్యాన శ్లోకం. మనో వాక్కాయ కర్మలను మారుస్తూ స్వామి చేసే లీలను మానవమాత్రురాలిని నేనెలా గుర్తించగలను. నేటి సాత్వికము రేపు తామసమునకు పెద్దపీట వేయగలదు.యుక్తాయుక్తమును దూరముచేయగలదు.మంచి-చెడుల మధ్య తాను దాగి మాయ, మనలను ఆడించగలదు.లేవలేనంత పతనములోనికి పడవేయగలదు. అదియే తనలో నిజమును గ్రహించలేని మాయాజాలము. మనము చెప్పుకోబోవు కథలోని రెండు పాత్రలు అక్కా-చెల్లెలు.ఒకరు మాయామోహితులు-మరొకరు మాయాతీతులు. వారిలో ఒకరిని వశపరచుకొనిన అసూయ తీవ్రమై ఏ విధముగా దురాకృతములను చేయించినదో,మరొకరి దరిచేరలేని అరిషడ్వరగములు స్వామి మహోదారత వలె ,ఎంతటి ఔదార్యమును ప్రదర్శించినదో తెలుసుకుందాము. ప్రియ మిత్రులారా! ఈనాటి మన బిల్వార్చనలో మనము " అసూయ" అను పదము తెచ్చిన అనర్థములను గురించి,వానిని అవలీలగా దాటించిన మహోదా...