paahimaam paramesvari kausiki-Sumbhanishudini sailasutae

పాహిమాం కృపాకరి కౌశికి-రమ్యకపర్దిని శైలసుతే *********************************** " ఓం ఘంటా శూల హలాని శంఖ ముసలే చక్రం ధనుః సాయకం హస్తాబ్జైః దధతీం ఘనాంత విలసత్ శీతాంశు తుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీం అనుభజే శుంభాది దైత్యార్ధినీం." ఒకసారి గంగాతీరమునందు సకలదేవతలు శరణార్థులై, " నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం" అని ప్రార్థించుచుండగా, " భావనామాత్ర సంతుష్ట హృదయ" యైన భవాని గంగా జలములలో స్నానమాచరించుటకు అటుగా పోవుచు,వారిని చూసి, మీరు ఎవెరిగురించి స్తోత్రములు చేయుచున్నారని అడిగెను. వారు సమాధానమును ఇవ్వలేని దీనస్థితిలోనుండుట గమనించి, పార్వతి శరీర కోశమునుండి ఒక దివ్యసుందర శక్తి ప్రకటింపబడి,తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానముగా, వీరందరు శుంభ-నిశుంభులచే రాజ్యమునుండి తరుమవేయబడి,కనీసము హవిస్సులను సైతము పొందలేక జగన్మాతవైన నీ పదకమలముల శరణు కోరుతున్నారనెను. ఇది సమరమునకు ఒకవైపునున్న ప్రకటనము. మరొకవైపు? ఎవరా శుంభ-నిశ...