ALO REMBAVAAY-19

పంతొమ్మిదవ పాశురము. ****************** కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్మేల్ మెత్తెన్ర పంచశయనత్తిల్ మేలేరి కొత్తలర్ పూంగుళల్ నప్పిన్నయై కొంగైమేల్ వెత్తుకిడంద మలర్మార్పా వాయ్ తిరవాయ్ మైత్తిడం కణ్ణిణాయ్ నీ ఉన్ మణాలనై ఎత్తనై పోదుం తుయిలెళ ఒట్టయ్ కాణ్ ఎత్తన ఏలుం పిరివాట్ర గిల్లయాల్ తత్తువ మన్రు తగవేలో రెంబావాయ్. ఓం నమో లక్ష్మీ నారాయణాయనమః ****************************** ఈ పాశురములో గోదమ్మ మనకు లక్ష్మీనారాయణుల అమలిన-అమరిన మైధునపు మహోత్కృష్టతను విశదపరుస్తున్నది. గోపికలు క్షణమైననను స్వామిదర్శనమును మరచి ఉండలేని ధన్యులు .వారు నీలమ్మను మేల్కొలిపి స్వామిని వ్రతమునకు తీసుకుని రమ్మని చెప్పినను వారి అడుగులు ముందుకు సాగుటలేదు.ఒకసారి స్వామిని మేలుకొలిపి చూసి అమ్మను అనుగ్రహించమని అర్థించి తరలుదాము అని నీలమ్మ ఇంటిముందు నిలబడి మనసులో వారున్నస్థితిని దర్శిస్తూ,ప్రస్తుతిస్తున్నారు. ఏ విధముగా చిన్నపిల్లలను భోజనముచేసావా? అని అడిగితే బిత్తరచూపులు చూస్తారో,ఆం తిన్నావా అని అడిగితే బదులిస్తార...