TIRUPPAAVAI-27

తిరుప్పావై-పాశురం-27 **************** " " నీళాతుంగస్తన గిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ స్వశృతిశత స్సిద్ధముద్యాపయంతే స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యాం బలాత్ కృత్యభుంగ్తే గోదా తస్యై నమ ఇద మివం భూయ యే వాస్తు భూయః" పూర్వ పాశుర ప్రస్తావనము *********************** స్వామికి గోపికలపై -గోపికలకు స్వామిపై నున్న వాత్సల్యమును మణిమయ స్వరూపకాంతిగాకీర్తించుచున్నది గోదమ్మ. . ప్రళయసమయములో బ్రహ్మాండములను తనఉదరములో దాచుకొని,వటపత్ర సాయిగా మార్కండేయునిచే కీర్తించబడిన స్వామి సామర్థ్యమును సంస్తుతించినది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయము గోపికలు నోమునకు కావలిసిన వస్తువులను అడుగుతున్నట్లుగా అనిపిస్తున్నప్పటికిని స్వామి వైకుంఠముతోసహా తరలి విచ్చేయమని విన్నవించుకొనుట. గోదమ్మ ఈ పాశురములో అంతః-బహిః యాగములను గోపికలు స్వామిని అర్థించుఆరు విశేషములలో నిక్షిప్తపరచినది. 1 శంఖ ప్రణవనాదము-మంత్రాసనము (స్వామికి) 2,పఱ వాయిద్య ఘోష-తిరుమంజనము 3.పల్లాండు-అలంకరణము-మంత్రపుష్పము 4.దీపము...