PAHIMAM MAHISHASURAMARDINI-RAMYAKAPARDINI SAILASUTE-01
%20(1).jpg)
పాహిమాం మహిషాసురమర్దిని-రమ్యకపర్దిని శైలసుతే *********************** ॥ (సౌందర్యలహరి) "భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం- ఇతి స్తోతుం వాంఛన్ కథయతి" భవాని" త్వమితి యః । తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదా." తల్లీ భవానీ! ముకుంద-బ్రహ్మేంద్రాదులు వారి రత్నమయ కిరీటములతో శిరసు వంచి నీపాదపద్మములకు హారతులు పట్టుచున్నారు అని అమ్మను సంస్తుతిస్తున్నారు శ్రీ ఆదిశంకరులు. క్షీణే పుణ్యం...పుణ్యము యొక్క హెచ్చు-తగ్గుల లెక్కలే కూడికల-తీసివేతలే జీవుల కర్మఫలితములు అని తెలియచేయు దివ్యచరితములే దేవికథలు-కథనములు.సూత్రధారియైన ఆ జగన్మాత ఎన్నో పాత్రలను/ఎందరో పాత్రధారులను కల్పించి కామితార్థములను అనుగ్రహిస్తుంది. అందుకు ఉదాహరణమే బ్రహ్మ-విష్ణు-ఇంద్రాదులు,(మకుటనీరాజిత.) భవాని త్వం దాసే అంటూ అమ్మను స్తుతించటము. త్రిమూర్తులు మాత్రమే కాదు శ్రీ లలితా సహస్ర రహస్యనామ స్తోత్రములో నుతింపబడినట్లు,తల్లి "దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవా" ఆ పరాత్పరి అన...