KADAA TVAAM PAsYAEYAM-02

కదా త్వాం పశ్యేయం-02 ****************** " జిహ్వ చిత్త శిరోంఘ్రి హస్త నయన శ్రోతైః అహం ప్రార్థితం. నమామి భగవత్పాదం శంకరంలోక శంకరం.". ' స్తవై బ్రహ్మాదీనాం జయజయ వచోభిర్నియమినా గణానాం కేళీభిర్మదకల మహోక్ష్స్య కకుది" బ్రహ్మాదులు-నియమపాలితులైనమునులు-పరవస్త్స్తున్న ప్రమథగణములు - అంబా సమేతముగా తనపై నున్న స్వామి అనుగ్రహమును వహిస్తూ నందీశ్వరుడు చేయుచున్న జయ-జయ-జయ-జయ ధ్వానములను మనోఫలకముపై ముద్రించుకుని,ఈ నాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము. "జయ జయ జయ పార్వతీ పరమేశ్వరా" నమో నమః. కొంచము సేపు విశ్రాంతి తీసుకుని మార్గబంధు సహాయముతో పయనము ప్రారంభించారు శంకరయ్య-శివయ్య. మౌనముగా వారి పాదాలుకదులుతున్నాయి.కాని శంకరయ్య మనసులోని పదాలు మాత్రం పరుగులు తీస్తున్నాయి. ఇదేనేమో "గురోస్తు మౌనంవ్యాఖ్యానం- శిష్యాస్తు ఛ్చిన్న సంశయా అంటే" పొరబడుతున్న శంకరయ్య మనసు ప్రత్యర్థి ...