SAUNDARYA LAHARI-94
సౌందర్య లహరి-మణిద్వీప ఉపోద్ఘాతము పరమపావనమైన నీ పాదరజకణము పతిత పాలకమైనపరమాత్మ స్వరూపము మథుకైటభ విధ్వంసములకు భయపడినవాడు తామరతూడు క్రిందకు జారి దాగినాడు (బ్రహ్మ) అది తామరసదళనేత్రుని నాభియని గ్రహియించె నానా సంశయములను తల్లి తొలగించ దలచె దివ్య విమానమును పంపి త్రిమూర్తులను దీవించె సప్త అథోలోకములను-సప్త ఊర్థ్వ లోకములను దాటి సాక్షాత్ సర్వేశ్వరి దయతో సాగుచున్న వారికి సందర్శనమైనది సర్వలోకము అన్న సత్యము తెలిసిన వేళ నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా మానస విహారి ! సౌందర్య లహరి. బ్రహ్మాండములకు గొడుగైన మణిద్వీపమునకు వందనం మణిద్వీప వాసిని మూల ప్రకృతికి వందనం." జగన్మాత నీ లీలలను తెలిసికొనలేని మాయామోహితులైనారు త్రిమూర్తులు.ఇక మేమెంత? తల్లి నిర్హేతుక కృపాకటాక్షమునకు నిజ నిదర్శనము సంకల్పమాత్ర సర్వలోకము మన.మనో-వాక్కాయ-నమస్సులను స్వీకరించి,అనుగ్రహ ఆవిష్కారమే మణిద్వీప సందర్శనము. ...