TIRUPPAVAI-PASURAM-15
.jpg)
తిరుప్పావై-పాశురం-15 **************** మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం విశ్వోప జీవ్యమమృతం మనసా దుహానాం తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం సంతః పయోధి దుహితః సహజాంవిదుస్త్వాం. పూర్వపాశుర ప్రస్తావనము ****************** శుద్ధి వ్రత ఐదు పాశురములను సేవించుకుని,భాగవత దాస్య విభాగములోని పదిమంది జ్ఞానుల దాస్యమును మనము ప్రస్తుతపాశురముతో ముగించుకొనబోతున్నాము.ఈ పదిమంది అదే సుగుణ సంపన్నుల,తేజో సంపన్నుల,ఐశ్వర్య సంపన్నుల,అవ్యాజ అనుగ్రహ సంపన్నుల,సంపూర్ణాధికారిక సంపన్నుల సామూహిక ప్రాతినిధ్యమునకు సమిష్టి సంకేతములు.వారు మన ముందు నిలిచి,మనచే శ్రీవ్రతము చేయించబోతున్న స్వామి స్వరూపములు.6 నుండి 15 పాశురములు మనలోని దశేంద్రియములను వ్రతమునకు సిద్ధపరచు, ఆచార్య అభ్యర్థనముగాను భావించవచ్చును. ప్రస్తుత పాశుర ప్రాభవము. ********************* మనము రెండవ పాశురములో, "తీక్కరలై శెన్రుదో" చెడు మాటలను ఇంకొకరి చెవికి చేర్చవద్దు-మన చెవికి రానీయ వద్దు అను ఒక నిబంధనమును గమనించాము. దాన...