DEVIKHADGAMALA AMTE?

శ్రీ మాత్రే నమః ****************** " అమ్మవు నీవే అఖిలజగాలకు-అమ్మలకన్న అమ్మవు నీవే నీ చరణములేనమితినమ్మ-శరణము కోరితి నమ్మా భవాని" అని వేడుకుంటున్న తన బిడ్డలను కరుణించకుండా ఉండగలదా ఆ పరమేశ్వరి. అందుకే పరంజ్యోతిగా ప్రకాశములో ఇమిడి ఉన్న తాను దాని నుండి కొంత భాగముగా విడిపోయి,మనలను కాపాడుటకై దిగివచ్చినది అని నా నమ్మకము. ఇంకొక విధముగా చెప్పాలంటే ఆలోచన+ఆచరణ అను రెండింటిని సమర్ధిస్తూ అయ్య+అమ్మ ఒకరు కనపడకుండ కథనడిపిస్తూ,మరొకరుకనపడుతు మనలను చేరదీస్తూ,ప్రపంచమనే గారడీని చేస్తున్నారన్నమాట లీలగ. నిజమునకు వారిద్దరున్నది ఒకతొమ్మిది అంతస్తుల భవనము.ఒక్కొక్క అంతస్తు ఒక్కొక్క సుందరమైన ఆకారముతో,దాని ప్రాముఖ్యతను తెలియచేస్తుంటుంది.ప్రతి అంతస్తులో ఎందరో మహిమగల మాతృమూర్తులు మనకు పై అంతస్తు చేరుటకు సహాయపడుతుంటారు.పైకి చేరుతున్న కొలది వాతావరనము శుభ్రమైనట్లు,మన మనోభావములు కూడా పరిశుద్ధమగుతుంటాయి. మనకు అవసరములేనివస్తువులు ఏవో గ్రహించి వానిని పైకి తీసుకుని వెళ్ళకుండ వదిలించుకుంటూటాము.ఏది నిజము/ఏది అబద్ధము తెలుసుకోగలుగుతామ...