NA RUDRO RUDRAMARCHAYAET-05 (SIVAANAMDALAHARI)

స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యే ష్చతురః కథం రాజ్నాం ప్రీతి ర్భవతి మయి కో2హం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో సర్వస్య శరణాగతిని సూచిస్తున్నారు ఆదిశంకరులు ప్రస్తుత శ్లోకములో. చతుషష్ట్యుపచారాఢ్యా-చతుషష్టి కళామయి అని అమ్మవారిని సంకీర్తిస్తున్నది లలితాసహస్రనామము. షోడశ కళానిధికి షోడశోపచారములు అని సంకీర్తించి తరించాడు అన్నమయ్య. నాల్గవ శ్లోకములో ఆదిశంకరులు విబుధా క్షుద్రఫలదా న మనయె-అని సాకారులైన విబుధులు/దేవతలు అనంతముగా నున్నప్పటికిని,నేను కలలోనైన వారిని సేవించి,వారనుగ్రహమునకై పాకులాడను అన్నారు. ఆ విషయమును సమర్థిస్తూ దానికి కారణము తన పశుత్వమే అంటున్నారు. ఓ సర్జ-సమస్తము నీవైన శంభో నను-పశుం మ ' పశ్యతీతి పశుః' చూడగలుగునది పశువు.కాని చూసినదాని మర్మమును మనసులో ముద్రించుకొనలేనిది.చూసినదృశ్యమును అర్థము చేసుకొనలేని అసమర్థ ను రక్షించగలిగినది కేవలము పశుపతి మాత్రమే. ఎందుకంటే స్వస్వరూపమును అర్థముచేసుకొనలేని,సకల్శాస్త్ర పరిజ్ఞానముతో వాటిని అనగా శృతి-స్మృతి-పురాణ-సకల కళల సారమును సమన్వ...