Posts

Showing posts from October 10, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-05 (SIVAANAMDALAHARI)

Image
 స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యే ష్చతురః కథం రాజ్నాం ప్రీతి ర్భవతి మయి కో2హం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో  సర్వస్య శరణాగతిని సూచిస్తున్నారు ఆదిశంకరులు ప్రస్తుత శ్లోకములో.  చతుషష్ట్యుపచారాఢ్యా-చతుషష్టి కళామయి  అని అమ్మవారిని సంకీర్తిస్తున్నది లలితాసహస్రనామము.  షోడశ కళానిధికి షోడశోపచారములు అని సంకీర్తించి తరించాడు అన్నమయ్య.  నాల్గవ శ్లోకములో ఆదిశంకరులు విబుధా క్షుద్రఫలదా న మనయె-అని సాకారులైన విబుధులు/దేవతలు అనంతముగా నున్నప్పటికిని,నేను కలలోనైన వారిని సేవించి,వారనుగ్రహమునకై పాకులాడను అన్నారు.  ఆ విషయమును సమర్థిస్తూ దానికి కారణము తన పశుత్వమే అంటున్నారు.  ఓ సర్జ-సమస్తము నీవైన శంభో  నను-పశుం మ ' పశ్యతీతి పశుః' చూడగలుగునది పశువు.కాని చూసినదాని మర్మమును మనసులో ముద్రించుకొనలేనిది.చూసినదృశ్యమును అర్థము చేసుకొనలేని అసమర్థ ను రక్షించగలిగినది కేవలము పశుపతి మాత్రమే.  ఎందుకంటే స్వస్వరూపమును అర్థముచేసుకొనలేని,సకల్శాస్త్ర పరిజ్ఞానముతో వాటిని అనగా శృతి-స్మృతి-పురాణ-సకల కళల సారమును సమన్వ...

NA RUDRO RUDRAMARCHAYAET-04(SIVAANAMDALAHARI)

Image
  సహస్రం వర్తంతే జగతి విబుధాః క్శుద్ర-ఫలదా న మన్యే స్వప్నే వా తద్-అనుసరణం తత్-కృత-ఫలం హరి-బ్రహ్మాదీనాం-అపి నికట-భాజాం-అసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ-భజనం    మూడవ శ్లోకములో వేదములను పరతత్త్వమును తెలుసుకొనుటకు సాధకములుగా చూపించిన శ్రీ శంకరులు ప్రస్తుత శ్లోకములో జీవి వస్థలయొక్క ప్రభావమును,మనము కోరుకోవలసిన/చేరుకొవలసిన తురీయమును గురించి,న మన్యే స్వప్నేవా అంటూ స్వప్నావస్థలో సైతము కోరుకోను/కలలోనైనా ఊహించను ప్రభో అని మనలను చైతన్యవంతులను చేస్తున్నారు.  ఎందుకంటే మనకు కావలిసినది అతి దగ్గరగా ఉండి సేవిస్తున్న హరి,బ్రహ్మ,ఇంద్రాదులకు సైతము సులభము కానిది.  వారికి లభ్యము కాని తురీయస్థితి కేవలము నీచే మాత్రమే పొందగలిగిన దానిని అనుగ్రహించగలవారెవరు కలరు?   ఒకవేళ బుధులు అనుగ్రహించదలచినను అవి శాశ్వతానందమునీయగల సామర్థ్యమును కలిగియుండలేవు.  కనుక విభో నేను కోరుకునేది నీ పాదపద్మ నిత్య సంసేవనము.దానికి నన్ను నేనెట్లు మలచుకోవలెనో తెలియచేయుము కరుణతో అని ప్రార్థిస్తున్నారు.  స్వప్నావస్థలోనైనా కోరుకోను వారిని(విబుధులను/దేవతలను) అదియును అనేకానేకములుగా నున్న వారిని అన్నద...

NA RUDRO RUDRAMARCHAYAET-03 (sIVAANAMDALAHARI)

Image
 త్రయీ-వేద్యం హృద్యం త్రి-పుర-హరం ఆద్యం త్రి-నయనం జటా-భారోదారం చలత్-ఉరగ-హారం మృగ ధరమ్ మహా-దేవం దేవం మయి సదయ-భావం పశు-పతిం చిత్-ఆలంబం సాంబం శివమ్-అతి-విడంబం హృది భజే 3  మూడవ శ్లోకములో ఆదిశంకరులు వారి నివాసము మన హృదయస్థానము అని తెలియచేసి,దానిని గుర్తించుటకు కావలిసిన త్రినేత్రము/జ్ఞాన నేత్రము కేవలము త్రయీవేద్యం అని సులభమార్గమును అందిస్తున్నారు.నీ చర్మచక్షువులు కానిలేని ఆ, 1.చిత్-ఆలంబం-తేజో స్తంభము-అరుణాచలేశ్వరుడు 2.త్రిపురహరం-త్రిగుణములను అసురులను మట్టుబెట్టి తురీయస్థితికి చేర్చగలవానిని 3.జటభార ఉదారం-ఉదారతతో తన జటాభారములో గంగను బంధించి లోకహితము చేసినవానిని 4.చలత్ ఉరగహారం-భయకంపితమైన(వాసుకిని) తన మెడలో ధరించినవానిని,  సంసారవిషసర్పములను చూచినను నిశ్చలత్వమును కలిగియుండు ధైర్యమును ప్రసాదించువానిని 5.మృగధరం-అని క్షణము/అశాశ్వతమైన ప్రాణరక్షణకు/ఉపాధిని రక్షించుకొనుటకు పరుగులు తీయు జీవులకు నిశ్చలత్వమును తన రక్షణలో అనుగ్రహించువానికి  ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటిని అలంకారముగా భావించి మోసపోకుసుమా.ఇవన్నియు మన చంచలస్వభావాలే సుమా.  మనకు కనువిప్పు కలిగించుటకు మాత్రమే కనువిందుగా కనిపి...