KANAPULLA NAAYANAARU
కణుంపుల్ల నాయనారు ********************** నమో శుష్కాయచ హరిత్యాయచ పచ్చి గడ్డి/పచ్చి కట్టెల రూపములో, ఎండుగడ్డి/ఎండు కట్టెల రూపములో నున్న శివునికి నమస్కారములు. గడ్డిని కోసి,మోపులు కట్టి అమ్మి వచ్చిన డబ్బులతో శివభక్తునిగా ఖ్యాతిని గాంచిన,పుల్లరెక్కు వల్లూరులో జన్మించిన కణంపుల్ల (గడ్డిమోపు) నాయనారునకు నమస్కారములు. నాయనారు పచ్చిగడ్దిని కోసి,మోపులులను తలపైకెత్తుకుని,అమ్మి,వచ్చిన పైకముతో జీవించెడివాడు. దర్భలను వత్తులుగా మలచుకొని అగ్నికార్యములను ఆచరించుచు,ఆనందముగా శివనామ సంకీర్తనమును చేయుచు నుండెడివాడు. నాయనారు వైదిక పూజావిధానమునకు ఆటంకమును కలిగించాలనుకున్నాడు వైదీశ్వరుడు. పరీక్షను నిర్వహించడానికి కరువుకు గడ్డి మిగలకుండా చేశేలా ఉత్తరువులను జారీచేసాడు. మారుమాటాడకుండా గడ్డి పరకలను మాయము చేసేసింది. గడ్డు సమస్యకు శ్రీకారమును చుట్టింది. నమో నమో ఉలప్యాయచ అనేకరకములైన గడ్డిజాతులలో నిండియున్న నిటలాక్ష నమస్కారములు. సమిధలకు,వత్తులకు అగ్నికార్యములకు అతిముఖ్యమైన గడ్డి,దుర్వారములు కనుచూపుమేరలో కానరాకుండా రాబోవు/కాబోవు స్వామి సేవగా, " ...