NA RUDRO RUDRAMARCHAYAET-02( SIVAANAMDALAHARI)

గళంతీ శంభో త్వత్-చరిత-సరితః కిల్బిష -రజో దళంతీ ధీకుల్యా- సరణిషు పతంతీ విజయతామ్ దిశంతీ సంసార-భ్రమణ-పరితాప-ఉపశమనం వసంతీ మత్-చేతో-హృదభువి శివానంద-లహరీ మొదటి శ్లోకములో పార్వతీపరమేశ్వరులు అస్తోక సమస్తభువనములకు శుభములందించువారిగా స్తుతిస్తూ,మనకు వారి సర్వవ్యాపకత్వమును తెలియచేశారు. కాని మనము ఉన్న (అందరు కాదు) ఉన్న ప్రస్తుత పరిస్థిని గ్రహించి వారు ఎక్కడున్నారో తెలియక కాలమును వృధా చేస్తామన్న తలపుతో, వారుండే స్థానమును/అదియును మనకు అత్యంత సమీపముగా /మనము చేరి గుర్తించదగినదానిని సూచిస్తున్నారు. "విజయతాం దిశంతీం" మనకు విజయమార్గమును చూపించుటకై,వారు చేయు ప్రయాణము,తొలగించు అడ్దంకులను,కలిగించు శుభములను వివరిస్తున్నారు నాలుగు రమ్యమైన క్రియాపదములతో. 1.గలంతీ-ప్రవహిస్తూ, 2.దళంతీ-ప్రక్షాళిస్తూ 3.పశంతీ-పడగొట్టివేస్తూ 4.దిశంతీ-దిశను చూపిస్తూ మనలను అనవరతము కాపాడుటకు ఇక్కడే మన చేతో హ్రదము-చైతన్యముతో నుండిన హ్రదము-సరసు నందు కొలువై యున్నారు. దీనినే రుద్రము, " నమః పార్యాయచా-వార్యాయచ" పారము అనగా నదికి(సంసారమనే) అవ...