JVAALAAYAAM VAISHNAVEEDAEVI

jvaalaayaam vaishNaveedaevi "సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరి నారాయణి నమోస్తుతే." "కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః".తల్లి తన చేతివేళ్ళగోళ్ళనుండి దశావతార నారాయణులను సృష్టించి,వారిని ధర్మ సంస్థాపనకు ఉపకరణములు చేసి,వారి శక్తులను తనలో అంతర్లీనము(కల్కి)తప్ప అంతర్లీనము చేసుకొన్నది.ఇది చర్మ చక్షువులకు అర్థమైనది.సూక్షమను ఒకింత ఆలోచిస్తే 1.కర్త-2.కరణము-3.కార్యము-4.ఫలము/ఫలితము అని నాలుగుగా విభజింపబడిన శక్తియొక్కటే.కనుక కర్తగా తలపోసి,కరణములను సృష్టించి,కార్యరూపము దాల్చి,ఫలితములను ఫలములను అందుకొనుచున్నది అమ్మ.చిఛ్చక్తియే సర్వవ్యాపకమై (వైష్ణవమై) త్రికూటాచల పర్వత మధ్యమున మాయాసతి శిరోభాగము సర్వ శ్రేష్ట జ్వాలాయాం శక్తిపీఠముగా మనలను అనుగ్రహించుచున్నది. త్రికూటాచల పర్వతశ్రేణులలోని జ్వాలా క్షేత్రములో,మాయాసతియొక్క శిరోభాగము పడిన ప్రదేశములోఒకే శిలపై ఊర్థ్వ భాగమున శక్తిస్వరూపము గాను,అథోభాగమున మహాలక్ష్ని-మహావాణి-మహా గౌరి శక్తులైన మూడురూపములలో ద్యోతకమగుతు,మనలను దీవిస్తుంటుంది తల్లి. ...