Posts

Showing posts from January 1, 2024

TIRUPPAAVAI-PAASURAM-18

Image
  తిరుప్పావై-పాశురము-18 ****************** మాతః సముత్థితవతీ మది విష్ణుచిత్తం విశ్వోపజీవ్య మమృతం మనసా దుహానాం తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం సంతః పయోధి దుహితః సహజాంవిదుస్త్వాం. పూర్వపాశుర ప్రస్తావనము **************** నందభవనమునకు వెళ్ళి,యశోదా నందులను,బలరామకృష్ణులను మేల్కొలిపిన గోపికలు,వారికి నందగోపాలుని అనుగ్రహముగా అంబరము-తన్నీరు-శోరు అర్థించిరి.దాన విశిష్టతను వివరించిన గోదమ్మ , ప్రస్తుత పాశుర ప్రాభవము ********************* ప్రస్తుత పాశురములో "పురుషకారత్వము" సిఫారసు అను అద్భుత మాతృ నాత్సల్యమును "నీళాదేవి " జగన్మాత ను పరిచయము చేస్తున్నది. పాలకడలి చిలుకుటకు ఎంతో కష్టబడిన తరువాత ప్రభవించిన క్షీరసాగర కన్య మనలను అనుగ్రహించుటకై, " మామేక శరనం వ్రజః"అను చరమ వాక్య స్వభావమై,అన్యథా శరనం నాస్తి-త్వమేవ శరణం మమ అనగానే అడ్డుపడి,మనకర్మఫలములకు ప్రాయశ్చిత్తమను ఉపాయమును సూచించి,అనన్య శరణత్వమనే ఆలంబనమును చూపించి ,స్వామి మనలను ఉద్ధరించునట్లు చేస్తున్న కరుణయే "నీళాదేవి." నీలమేఘశ్యాముడు పాప-పుణ్యముల చిట్టా ప్రకారమే ఫలితములు చేతనులకూని అంటే,అ...

TIRUPPAAVAI-PAAsURAM-17

Image
     తిరుప్పావై-పాశురం-17    *******************   మాతః సముత్థితవతీ  మదివిష్ణుచిత్తం   విశ్వోపజీవ్యమమృతం మనసా దుహానాం   తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం    సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం.   పూర్వ పాశుర వైభవము.   *******************   జ్ఞానులను తమ నోమును నిర్వహించుటకు మేల్కొలిపి గోపికలు,అత్యంత యశోవిరాజితమైన నందగోపభవనమునకు స్వామిని సంసేవించుకొనుటకు బాహ్యప్రాకారమును ,ద్వారపాలకుల అనుమతితో దాటి,ఐహికములను విడిచి,లోపలి ద్వారమును చేరి,శయన మందిరము సమీపించుచున్నారు.    వాచకార్థము అదే అయినప్పటికిని,వారు విషయవాసనలను అధిగమించి,ఆచార్యుల సహకారముతో స్వామి సమాగమనమునకు సంసిద్ధిలగుచున్నారు.   ప్రస్తుత పాశుర ప్రాశస్త్యము   *****************   1.దానమును (సాత్విక-రాజస-తామస) దాని ప్రాముఖ్యతను -ఫలితములను గోదమ్మ వివరించినది.   ప్రతిఫలాపేక్షలేకుండా/శక్తికి లోపము రానీయకుండా అర్హులకు చేసే దానము సాత్త్విలము.   ప్రతిఫలమును కోరుతూ/ప్రయోజనము ఆశించి తన విభవము నలుగురికి తెలిసేలా ప్రకటించుకొనుచు ,చేసే దానము రాజస ...