TIRUPPAAVAI-PAASURAM-18
.jpg)
తిరుప్పావై-పాశురము-18 ****************** మాతః సముత్థితవతీ మది విష్ణుచిత్తం విశ్వోపజీవ్య మమృతం మనసా దుహానాం తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం సంతః పయోధి దుహితః సహజాంవిదుస్త్వాం. పూర్వపాశుర ప్రస్తావనము **************** నందభవనమునకు వెళ్ళి,యశోదా నందులను,బలరామకృష్ణులను మేల్కొలిపిన గోపికలు,వారికి నందగోపాలుని అనుగ్రహముగా అంబరము-తన్నీరు-శోరు అర్థించిరి.దాన విశిష్టతను వివరించిన గోదమ్మ , ప్రస్తుత పాశుర ప్రాభవము ********************* ప్రస్తుత పాశురములో "పురుషకారత్వము" సిఫారసు అను అద్భుత మాతృ నాత్సల్యమును "నీళాదేవి " జగన్మాత ను పరిచయము చేస్తున్నది. పాలకడలి చిలుకుటకు ఎంతో కష్టబడిన తరువాత ప్రభవించిన క్షీరసాగర కన్య మనలను అనుగ్రహించుటకై, " మామేక శరనం వ్రజః"అను చరమ వాక్య స్వభావమై,అన్యథా శరనం నాస్తి-త్వమేవ శరణం మమ అనగానే అడ్డుపడి,మనకర్మఫలములకు ప్రాయశ్చిత్తమను ఉపాయమును సూచించి,అనన్య శరణత్వమనే ఆలంబనమును చూపించి ,స్వామి మనలను ఉద్ధరించునట్లు చేస్తున్న కరుణయే "నీళాదేవి." నీలమేఘశ్యాముడు పాప-పుణ్యముల చిట్టా ప్రకారమే ఫలితములు చేతనులకూని అంటే,అ...